AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amith Shah: 8న విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ.. ఏపీపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్‌..

బీజేపీ అగ్రనాయకత్వం ఏపీపై ఫోకస్‌ పెట్టిందా..? ఈ నెలలో ఇద్దరు అగ్రనేతల పర్యటన దేనికి సంకేతం..? ఢిల్లీ పెద్దల రాకతో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? ఇంతకీ ఏపీ విషయంలో కమలనాథుల ఆలోచన ఏంటి?

Amith Shah: 8న విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ.. ఏపీపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్‌..
Amit Shah
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2023 | 6:51 PM

Share

ఏపీలో షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే వైసీపీ, టీడీపీ వేడి రగిలిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఈనెల 8న విశాఖలో అమిత్ షా భారీ బహిరంగ సభ.. 10న వచ్చే జేపీ నడ్డాతో తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా.. లేదా అనే చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు పదే పదే ఈ అంశానికి సమాధానం ఇవ్వక తప్పడం లేదు. పవన్‌ కల్యాణ్‌ తమతోనే ఉన్నారని.. జనసేనతోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు మరోలా ఉన్నాయి.

పవన్‌ అభిప్రాయలను ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పామని ఇప్పటికే స్పష్టం చేయడంతో.. అమిత్ షా, నడ్డాల పర్యటనలో ఆ అంశంపై ఏదైనా క్లారిటీ వస్తుందా లేదా అన్నది ప్రశ్న. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటై 9 ఏళ్లు అయిన సందర్భంగా విశాఖ, తిరుపతిల్లో సభలు ఏర్పాటు చేశామని వీర్రాజు అండ్‌ కో చెబుతున్నా.. రాజకీయ కదలికలు ఉంటాయా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

విశాఖ, తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారంటే

బీజేపీ అగ్రనేతల పర్యటనలో విశాఖ, తిరుపతిని ఎంచుకోవడం కూడా చర్చగా మారింది. గతంలో ఈ రెండు చోట్ల బీజేపీ ఎంపీలు గెలిచారు. మళ్లీ అక్కడ పాగా వేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనా లేక ఇంకేదైనా ఉందా అన్నది తెలియాలి. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పదివేల కోట్లు మంజూరు చేసింది కేంద్రం. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి డెడ్‌లైన్లు పెడుతోంది. వీటన్నింటినీ చూశాక.. ఏపీలో బీజేపీ స్పీడ్‌ పెంచిందనేవాళ్లూ ఉన్నారు. మరి.. బీజేపీ అగ్రనేతల పర్యటనతో ఏపీలో ఎలాంటి రాజకీయ మార్పులు జరుగుతాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్