AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: జగన్‌

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ టూరిజంపై జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: జగన్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 4:36 PM

Share

Andhra Pradesh Tourism: పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ టూరిజంపై జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం ఆన్‌లైన్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యాట రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అనుగుణంగా నూతన పాలసీ ఉండాలని అన్నారు. పాలసీలో మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి తగిన స్థానం కల్పించాలని తెలిపారు.

రాజస్థాన్‌కి ధీటుగా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని జగన్ అన్నారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యాన్ని తీసుకురావాలని వెల్లడించారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయాలని, అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. అలాగే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి మంచి కాలేజీ పెట్టాలని.. అందులో నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందన్న విశ్వాసం, నమ్మకం కలిగించాలని సీఎం తెలిపారు. ఏపీటీడీసీ ప్రాపర్టీస్,లోన్స్‌ విషయంలో ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం చేయొద్దని.. సగం పూరైన ప్రాజెక్ట్‌లు ముందు పూర్తి చేయాలని ఈ సందర్భంగా జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read More:

శివ పార్వతి మాటలపై స్పందించిన ప్రభాకర్‌

‘టైటానిక్’ హీరోకు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు సవాల్‌