వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎంపీ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన వారసుడిని కూడా వెంట బెట్టుకొని వెళ్లిన ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, […]

వైసీపీ ఎంపీ పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే.. పార్టీ మారనున్నారా..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2019 | 5:14 PM

ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎంపీ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా తన వారసుడిని కూడా వెంట బెట్టుకొని వెళ్లిన ఆ ఎమ్మెల్యే వైసీపీ ఎంపీపై ప్రశంసలు కురిపించడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన బర్త్ డే కార్యక్రమానికి మంత్రి బాలినేనితో పాటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

ఇక ఇదే వేడుకలకు చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు వెంకటేష్‌తో హాజరయ్యారు. శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించే వరకు అక్కడే ఉన్నారు. అంతేకాదు ఎంపీ గురించి నాలుగు మంచి మాటలు చెబుతూ ప్రసంగించారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. కరణం టీడీపీని వీడి.. వైసీపీలో చేరబోతున్నాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు బలరాం వెళ్లడం వెళ్లడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు మాగుంట టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారని.. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారని.. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ వేడుకలకు హాజరయ్యారని చెబుతున్నారు. అంతేకాదు కరణం ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరని ఆయన సన్నిహితులు కుండ బద్దలుగొడుతున్నారు.