AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు మార్చినంత ఈజీ కాదు రాజధానులు మార్చడం

రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదంటూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. మూడు రాజధానుల ప్రస్తావన ఏంటో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. అభివ‌ద్ధి వికేంద్రీకరణ చేయొచ్చని.. కానీ ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని ఆయన అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే అభివృద్ధి జరగదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీపై విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ తలాతోక లేని నివేదిక […]

కారు మార్చినంత ఈజీ కాదు రాజధానులు మార్చడం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 29, 2019 | 10:39 AM

Share

రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదంటూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. మూడు రాజధానుల ప్రస్తావన ఏంటో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. అభివ‌ద్ధి వికేంద్రీకరణ చేయొచ్చని.. కానీ ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని ఆయన అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే అభివృద్ధి జరగదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీపై విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని సుజనా మండిపడ్డారు.

అమరావతి రాజధానికి గతంలో జగన్ అంగీకరించారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా ఆయన మాట్లాడుతున్నారని సుజనా దుయ్యబట్టారు. ఏడాదిలో 30రోజులు జరిగే అసెంబ్లీ అమరావతిలో పెడితే రాజధాని అంటారా..? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమరావతి పేరిట గత ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసిందని.. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని సుజనా గుర్తుచేశారు. ఇక అమరావతిలో ఆస్తులు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు కోర్టుకెళ్తే.. రూ.2లక్షల కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఇక ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తన పేరు ఉందని మంత్రులు అంటున్నారని.. ఒకవేళ తన పేరుంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎందుకు చదవలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధానిని కదిలితే ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని.. లీగల్‌గా ఇబ్బందులు ఎదురై కోర్టులు చుట్టూ తిరిగితే.. ప్రభుత్వం పరిపాలన ఇంకేం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రాజధాని మారిస్తే కేంద్రం కూడా చూస్తూ ఉరుకోదని.. కచ్చితంగా సమయానికి స్పందిస్తుందని సుజనా అన్నారు. రాజధాని అన్నది ఒక్క అమరావతి సమస్య మాత్రమే కాదని.. దీనిపై 13 జిల్లాల ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రేపు వైజాగ్ ప్రజలు కూడా ఆనందంగా ఉండరని సుజనా జోస్యం చెప్పారు. కుక్కలు మొరుగుతూ ఉంటాయి.. కానీ నేను ఏనుగులా ముందుకు వెళ్తానని సుజనా కామెంట్లు చేశారు.