AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్జీ పాలిమర్స్ కేసులో గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్…కీలక ఆదేశాలు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎన్జీటీ లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరించింది. ఈ మేరకు కలెక్టర్ వద్ద ఉంచిన రూ. 50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలన్న ఎన్జీటీ..కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి

ఎల్జీ పాలిమర్స్ కేసులో గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్...కీలక ఆదేశాలు
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2020 | 6:41 PM

Share

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఎన్జీటీ లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరించింది. ఈ మేరకు కలెక్టర్ వద్ద ఉంచిన రూ. 50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలన్న ఎన్జీటీ..కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒక్కొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్దర ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. రెండు నెలల్లో కమిటీ పునరుద్ధర ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని కోరింది. పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీ ఏర్పాటు చేయాలని, కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీరి సంస్థ నుంచి ప్రతినిధులు ఉండాలని తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని, రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఎన్జీటి ఆదేశించింది.

అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి రాష్ట్ర సీఎస్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలని చెప్పింది. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభం కాకూడదని వార్నింగ్ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే సంస్థ తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తుందని స్పష్టం చేసింది. ప్రమాదక రసాయనాలతో కూడిన ప్లాంట్లలో భవిష్యత్ లో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి, నిరోధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ తనిఖీలు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటి. మోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ కు ఉందని స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగే చర్యలు జరిగినప్పుడు ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని ఘాటుగా వ్యాఖ్యానించింది. విచక్షణాధికారాలకు లోబడే సుమోటో గా కేసు తీసుకున్నట్లు స్పష్టం చేసిన ఎన్జీటీ..హైకోర్టు, ఇతర ఫోరాలు వేసిన కమిటీలు చేసే విచారణల్లో ఎలాంటి విభేదం ఉండదని తెలిపింది. ఏ కమిటీ విచారణ అదే చేస్తుందని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను ఇస్తుందని చెప్పిన.. ధర్మాసనం నవంబర్ 3కి తదుపరి విచారణ వాయిదా వేసింది.