AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయనగరం జిల్లాలో తొలి కరోనా మృతి

రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు విస్త‌రించిన కరోనా తాజాగా విజయనగరం జిల్లాలో కూడా పంజా విసురుతోంది.

విజయనగరం జిల్లాలో తొలి కరోనా మృతి
Jyothi Gadda
|

Updated on: May 09, 2020 | 1:20 PM

Share

ఏపిని వెంటాడుతున్న క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. మొద‌టి నుంచి క‌రోనాకు దూరంగా ఉన్న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా క‌ల‌వ‌రం మొద‌లైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌కు విస్త‌రించిన కరోనా తాజాగా విజయనగరం జిల్లాలో కూడా పంజా విసురుతోంది. అంతేకాదు, కోవిడ్ కోర‌ల్లో చిక్కుకుని ఒక‌రు మ‌ర‌ణించారు. బలిజిపేట మండలం చిలకపల్లికి చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిన వృద్ధురాలికి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

మరోవైపు ఏపీలో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం కొత్తగా 43 కేసులు నమోదయినట్లు ఏపీ ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం 54మందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో కోవిడ్‌ కేసుల సంఖ్య 1930కు చేరుకుంది. ఇందులో 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 44 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 999 గా ఉందని..ప్రభుత్వం హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 553కు చేరింది. కృష్ణా జిల్లాలో 338, గుంటూరులో 376 కేసులు నమోదయ్యాయని తెలిపింది.