AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ.. ఆరు వారాలే గడువు

రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్‌గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులు కావడం విశేషం. కాగా ఆరు వారాల్లోగా వీరు ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల […]

అమరావతిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ.. ఆరు వారాలే గడువు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 9:27 PM

Share

రాజధాని అమరావతి సహా పట్టణాభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జీఎస్ రావు కన్వీనర్‌గా ఉండబోతున్న ఈ కమిటీలో ప్రొ. మహవీర్, డా. అంజలీ మోమన్, ప్రొ. శివానందస్వామి, ప్రొ.కె.టి. రవీంద్రన్, డా.కె.వి. అరుణాచలం సభ్యులుగా ఉన్నారు. వీరంతా అమరావతి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై విశ్లేషణ చేయనున్నారు. ఈ సభ్యులంతా పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులు కావడం విశేషం. కాగా ఆరు వారాల్లోగా వీరు ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటు పర్యావరణం, వరదల నియంత్రణలో నిపుణులైన వారిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా నియమించుకోవచ్చని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే గత కొన్ని రోజులుగా అమరావతి విషయం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల మధ్య పెను దుమారాన్నే సృష్టిస్తోంది. అమరావతిలో వరదలు వచ్చిన సమయంలో రాజధానిపై మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని, వరదలు వస్తే మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలతో అమరావతి వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వచ్చాయి. అమరావతి నుంచి దొనకొండకు రాజధానిని మార్చే అవకాశాలు ఉన్నాయని పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయి, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. రాజధాని రైతులు కూడా ఈ వివాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పటికీ.. అమరావతి నిర్మాణంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇక ఇంత జరుగుతున్నా.. సీఎం వైఎస్ జగన్ అమరావతి వివాదంపై స్పందించకపోవడంపై ప్రజల్లోనూ అనుమానాలు రోజురోజుకు పెరిగాయి. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి.. ఈ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీ తన నివేదికలో ఏం చెప్తుందో చూడాలి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు