Raghuveera Reddy: పుడమి నుంచి ఉబికి వస్తోన్న పాతాళ గంగ.. పీసీసీ మాజీ అధ్యక్షుడి పొలంలో అద్భుత దృశ్యం..

కరవు సీమలో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతల మోముల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతంలో గుప్పెడు నీరు కోసం వెయ్యి అడుగుల బోరు వేసినా కనిపించని పాతాళగంగమ్మ ఇప్పుడు తనంతట తానే పుడమి నుంచి ఉబికి పైకి వస్తుండడంతో

Raghuveera Reddy: పుడమి నుంచి ఉబికి వస్తోన్న పాతాళ గంగ.. పీసీసీ మాజీ అధ్యక్షుడి పొలంలో అద్భుత దృశ్యం..
Follow us

|

Updated on: Nov 26, 2021 | 6:15 PM

కరవు సీమలో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతల మోముల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. గతంలో గుప్పెడు నీరు కోసం వెయ్యి అడుగుల బోరు వేసినా కనిపించని పాతాళగంగమ్మ ఇప్పుడు తనంతట తానే పుడమి నుంచి ఉబికి పైకి వస్తుండడంతో రైతులు సంబరపడిపోతున్నారు . ఎలాంటి మోటార్‌ సహాయం లేకుండానే బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీటిని చూసి ఇది కలయా లేక నిజమా..అని తేల్చుకోలేకపోతున్నారు. అనంతపురంకు చెందిన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత పొలంలోనూ ఇలాంటి అద్భుతం సాక్షాత్కారమైంది. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలోని రఘువీరారెడ్డి పొలంలో బోరు బావి నుంచి ఉబికివస్తోన్న నీటిని చూసి చుట్టుపక్కల రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో 900 అడుగుల లోతులో బోరు వేసినా.. చుక్కనీరు లభించలేదు.. కానీ నేడు అదే బోరు బావిలో ఎలాంటి మోటార్‌ అమర్చకుండానే నీళ్లు పైకి వస్తున్నాయి’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరవు సీమగా పేరొందిన రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు బాగా మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగానే రఘువీరారెడ్డి పొలంలోనూ నీరు ఉబికివచ్చింది. ఈ సందర్భంగా తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అద్భుతం చూడలేదంటున్నారీ మాజీ మంత్రి. ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు మడకశిర పంచాయతీలో తాగునీటి కోసం ఎన్నో బోర్లు వేయించానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజా వర్షాలతో మరో ఐదేళ్ల పాటు భూగర్భ జలాలకు ఢోకా లేదంటూ రఘువీరా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర మండలంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి అద్భుత సంఘటనలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన రఘువీరా రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న ఆయన వ్యవసాయం చేస్తూ..సాధారణ జీవితం గడుపుతున్నారు.a

(లక్ష్మీకాంత్, అనంతపురం జిల్లా, టీవీ9) 

Also Read:

Dwaraka Tirumala: శ్రీవారి సన్నిధిలో మహిళా యాచకులపై అమానుష దాడి.. స్పందించిన భద్రతా విభాగం

Chandrababu: కౌరవసభలో అడుగు పెట్టను.. గెలిచి సభకు గౌరవం తెస్తా.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ