AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: కడుపు ఉబ్బిపోయి.. శ్వాస తీసుకోలేకపోతున్న మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పొలూరు గ్రామానికి చెందిన నాగమ్మ కడుపు ఉబ్బిపోయి, రెండేళ్లుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

Tirupati: కడుపు ఉబ్బిపోయి.. శ్వాస తీసుకోలేకపోతున్న మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
Rare Operation
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2022 | 8:10 PM

Share

Tirupati: హఠాత్తుగా ఆ మహిళ పొట్ట పెరగడం ప్రారంభమైంది. గర్భం కాదని తెలుసు కానీ, అంతకంతకూ పెరుగుతున్న పొట్ట ఆందోళనకు గురి చేసింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేసింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 16న రుయా అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. డాక్టర్‌ మాధవి ఠాగూర్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షించి అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. భారంగా మారిపోతున్న కడుపులో ఉన్న గడ్డను ఆపరేషన్ చేసి తొలగించాలని చెప్పడంతో తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి చేరింది బాధితురాలు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. 46 ఏళ్ల నాగమ్మ అనే మహిళ కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించిన వైద్యులు ఆపరేషన్ సక్సెస్ చేశారు.

మోయలేనంత బరువుఉన్న గడ్డ కడుపులో ఉండటంతో నడవడం కూడా సాధ్యం కాక, గత కొంతకాలంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగింది నాగమ్మ. నాగమ్మ స్వస్థలం సూళ్లూరుపేట మండలం మన్నారు కోటూరు గ్రామం. కాగా, 46 ఏళ్ల నాగమ్మను పరీక్షించి క్లిష్టమైన ఆపరేషన్ పూర్తి చేసారు వైద్యులు. జూలై16న ఆసుపత్రిలో అడ్మిట్ అయిన నాగమ్మ కు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మి సుశీల, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ పార్థసారథి పర్యవేక్షణలో ఆపరేషన్ చేశారు. గంట వ్యవధిలో కడుపులోని 35 కిలోల గడ్డను తొలగించారు. ప్రస్తుతం నాగమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని చెప్పారు.

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యులు ఓ మహిళకు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోంచి 35 కిలోల కణితిని బయటికి తీశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పొలూరు గ్రామానికి చెందిన నాగమ్మ(46) కడుపు ఉబ్బిపోయి, రెండేళ్లుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. చాలా ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 16న రుయా అనుబంధ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేరారు. డాక్టర్‌ మాధవి ఠాగూర్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం పరీక్షించి అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. అది పెద్దగా ఉండటంతో శస్త్ర చికిత్స పూర్తి చేసి తీసినట్లు మాధవి ఠాగూర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!