AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppada: ఉప్పాడలో భారీ పేలుడు.. బోట్ రిపేర్ షెడ్ లో ఘటన.. ఒకరికి తీవ్ర గాయాలు..

కాకినాడ జిల్లా ఉప్పాడలో భారీ పేలుడు సంభవించింది. బోటు రిపేర్ షెడ్డులో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో భారీ పేలుడు సంభవించింది. ఉప్పాడ..

Uppada: ఉప్పాడలో భారీ పేలుడు.. బోట్ రిపేర్ షెడ్ లో ఘటన.. ఒకరికి తీవ్ర గాయాలు..
Blast
Ganesh Mudavath
|

Updated on: Oct 13, 2022 | 6:38 AM

Share

కాకినాడ జిల్లా ఉప్పాడలో భారీ పేలుడు సంభవించింది. బోటు రిపేర్ షెడ్డులో జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యూ.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో భారీ పేలుడు సంభవించింది. ఉప్పాడ సముద్ర తీరం సమీపంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అమీనాబాద్ పెట్రోల్ బంక్ సమీపంలో గల బోటు రిపేర్ చేసే షెడ్ లో పెద్ద శబ్ధం వినపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాలువ పక్కనే బోట్లు నిలిపి రిపేర్ చేసుకునే షెడ్ వద్ద రోడ్డు పక్కన తుప్పలు తొలగించి దారి ఏర్పాటు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. బోటు రిపేర్ షెడ్ ఓనర్ బడే ఏసుదాసు అనే వ్యక్తి గునపంతో గొయ్యి తీస్తుండగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో ఏసుదాసు చెయ్యి తెగి పడింది. ఒకపక్క చెయ్యి.. మరోపక్క గునపం తునాతునకలైంది. రక్తపు మడుగులో పడి అల్లాడిపోతున్న ఏసుదాసును స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భారీ పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ పైప్ లీకైందా? లేక ఏదైనా పేలుడు పదార్థమా అనే కోణంలో క్లూస్ టీమ్‌తో కలిసి విచారణ చేస్తున్నారు. బోటు రిపేర్ షెడ్డులో ఒక్కసారిగా భారీ పేలుడు రావటంతో స్ధానికులు బాంబు పేలుడుగా దీన్ని భావిస్తున్నారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మత్సకారులతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో పేలుడు చోటు చేసుకోవడం కాకినాడ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

కాగా.. గతంలోనూ కాకినాడ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీలో మరోసారి పేలుడు జరిగింది. మిషనరీ ఎక్విప్‌మెంట్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. మృతులను సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌లుగా గుర్తించారు. ఆ ఘటనను మరవకముందే మరోసారి ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.