AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మూడు రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన.. తొంగి చూసిన ఇరుగు పొరుగు షాక్!

అది విశాఖలోని రద్దీగా ఉండే ప్రాంతం. ఒక్కసారిగా కలవరం. మిల్క్ బాయ్‌కు ఏదో అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో ఏదో జరిగినట్టు చెప్పాడు. ఇరుగు పొరుగు వెళ్లి తొంగి చూశారు. అంతే..! అందరూ షాక్. ఓ మృతదేహం ఇంట్లో మంచంపై పడి ఉంది.

Andhra Pradesh: మూడు రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన.. తొంగి చూసిన ఇరుగు పొరుగు షాక్!
Death
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 10, 2024 | 3:42 PM

Share

అది విశాఖలోని రద్దీగా ఉండే ప్రాంతం. ఒక్కసారిగా కలవరం. మిల్క్ బాయ్‌కు ఏదో అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో ఏదో జరిగినట్టు చెప్పాడు. ఇరుగు పొరుగు వెళ్లి తొంగి చూశారు. అంతే..! అందరూ షాక్. ఓ మృతదేహం ఇంట్లో మంచంపై పడి ఉంది. డీకంపోజ్ అయ్యే పరిస్థితిల్లో ఉంది. వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ ప్రారంభించారు.

అల్లిపురం గాంధీ బొమ్మ ప్రాంతంలో ఓ ఇంటి పై ఉన్న చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు నాగేశ్వరరావు అనే వ్యక్తి. అక్కడే గత కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. 2008 నుంచి భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. భార్య, కొడుకు మర్రిపాలెంలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు ఒంటరిగా అల్లిపురంలో ఉంటున్నాడు. ఏమైందో ఏమో కానీ.. జూలై 5వ తేదీ శుక్రవారం ఇంటిలోకి వెళ్లినట్టు స్థానికులు గుర్తించారు. ఆ తర్వాత బయటకు రాలేదు. తర్వాత మూడు రోజులకు ఆ ఇంటిని సమీపంలో ఏదో దుర్వాసన వస్తోంది.

విషయాన్ని ఓ మిల్క్ బాయ్ గమనించి స్థానికులకు చెప్పాడు. ఇరుగుపొరుగు వెళ్లి చూశారు. దీంతో మంచంపై మృతదేహం ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాగేశ్వరరావు రావే శవమై కనిపించాడు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహం పక్కనే మద్యం బాటిల్ ఉన్నాయి. మద్యానికి బానిసైన నాగేశ్వరరావు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. పూటుగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూ టౌన్ సిఐ తిరుమలరావు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…