AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 97 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనుంది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..
Train
Ravi Kiran
|

Updated on: Jun 23, 2022 | 8:05 AM

Share

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ అందించింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు రూట్లలో 97 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. కాకినాడ-లింగంపల్లి-కాకినాడ మధ్య జూలై 1 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు(80) నడవనుండగా.. హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య జూలై 1 నుంచి ఆగష్టు 28 వరకు స్పెషల్ ట్రైన్స్(17) నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

07295(కాకినాడ టౌన్ – లింగంపల్లి) – ఈ రైలు వారంలో మూడు రోజులు(సోమవారం, బుధవారం, శుక్రవారం) నడవనుంది. ఆయా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ట్రైన్.. మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రూట్ మధ్య జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

07296(లింగంపల్లి – కాకినాడ టౌన్) – ఈ రైలు ప్రతీ మంగళవారం, గురవారం, శనివారం పట్టాలెక్కనుంది. ఆయా రోజుల్లో రాత్రి 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుంది. ఈ రూట్‌లో జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

కాకినాడ-లింగంపల్లి-కాకినాడ(07295/07296): సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయని రైల్వే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

07115(హైదరాబాద్ – జైపూర్): జూలై 1 నుంచి ఆగష్టు 26 వరకు ఈ రూట్ల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రతీ శుక్రవారం నడిచే ఈ ట్రైన్ రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు జైపూర్ చేరుతుంది.

07116(జైపూర్ – హైదరాబాద్): జూలై 3 నుంచి ఆగష్టు 28 వరకు ఈ రూట్ల మధ్య నడిచే ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 3.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.

హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్(07115/07116): ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇతర్సి, భోపాల్, ఉజ్జయిన్, రట్లాం, మంద్సూర్, నిమచ్, చిత్తూర్‌గర్హ, భిల్వారా, బిజైనగర్, అజ్మీర్, ఫులేరా స్టేషన్స్‌లో ఆగుతుంది.

కాగా, ఈ స్పెషల్ ట్రైన్స్‌లో స్లీపర్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని.. ప్రయాణీకులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Railway Timetable

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!