AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. దక్షిణ మధ్య రైల్వే పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 97 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించనుంది.

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో 97 స్పెషల్ ట్రైన్స్..
Train
Ravi Kiran
|

Updated on: Jun 23, 2022 | 8:05 AM

Share

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) గుడ్ న్యూస్ అందించింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు రూట్లలో 97 స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించనుంది. కాకినాడ-లింగంపల్లి-కాకినాడ మధ్య జూలై 1 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రత్యేక రైలు సర్వీసులు(80) నడవనుండగా.. హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య జూలై 1 నుంచి ఆగష్టు 28 వరకు స్పెషల్ ట్రైన్స్(17) నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

07295(కాకినాడ టౌన్ – లింగంపల్లి) – ఈ రైలు వారంలో మూడు రోజులు(సోమవారం, బుధవారం, శుక్రవారం) నడవనుంది. ఆయా రోజుల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరిన ఈ ట్రైన్.. మరుసటి రోజు ఉదయం 09.15 గంటలకు లింగంపల్లి చేరుతుంది. ఈ రూట్ మధ్య జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి.

07296(లింగంపల్లి – కాకినాడ టౌన్) – ఈ రైలు ప్రతీ మంగళవారం, గురవారం, శనివారం పట్టాలెక్కనుంది. ఆయా రోజుల్లో రాత్రి 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరే ఈ ట్రైన్ మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుతుంది. ఈ రూట్‌లో జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

కాకినాడ-లింగంపల్లి-కాకినాడ(07295/07296): సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ ఆగుతాయని రైల్వే అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

07115(హైదరాబాద్ – జైపూర్): జూలై 1 నుంచి ఆగష్టు 26 వరకు ఈ రూట్ల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. ప్రతీ శుక్రవారం నడిచే ఈ ట్రైన్ రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు జైపూర్ చేరుతుంది.

07116(జైపూర్ – హైదరాబాద్): జూలై 3 నుంచి ఆగష్టు 28 వరకు ఈ రూట్ల మధ్య నడిచే ఈ స్పెషల్ ట్రైన్ ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్ నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 3.00 గంటలకు హైదరాబాద్ చేరుతుంది.

హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్(07115/07116): ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, బస్మాట్, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖండ్వా, ఇతర్సి, భోపాల్, ఉజ్జయిన్, రట్లాం, మంద్సూర్, నిమచ్, చిత్తూర్‌గర్హ, భిల్వారా, బిజైనగర్, అజ్మీర్, ఫులేరా స్టేషన్స్‌లో ఆగుతుంది.

కాగా, ఈ స్పెషల్ ట్రైన్స్‌లో స్లీపర్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని.. ప్రయాణీకులు ఈ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Railway Timetable

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్