అమెరికాలో కరోనా సెకండ్ వేవ్.. గ్రామీణ ప్రాంతాలకు పాకిన వైరస్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యాధికారులు..!

కరోనా వైరస్ రెండో విడత ప్రపంచాన్ని ఆవహించింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనజీవనం మరోసారి అల్లాడుతోంది. అటు అగ్ర రాజ్యం కరోనా ధాటికి చిరుగుటాకులా వణికిపోతుంది.

అమెరికాలో కరోనా సెకండ్ వేవ్.. గ్రామీణ ప్రాంతాలకు పాకిన వైరస్.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యాధికారులు..!
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:46 PM

కరోనా వైరస్ రెండో విడత ప్రపంచాన్ని ఆవహించింది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనజీవనం మరోసారి అల్లాడుతోంది. వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. నిన్న ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 5,26,105 కరోనా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రతతో ఉందో అద్దం పడుతోంది. వైరస్ వ్యాప్తి నగరాలకే కాకుండా రూరల్ ప్రాంతాలకు విస్తరిస్తోంది. దీంతో వైద్యాధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.

అటు అగ్ర రాజ్యం కరోనా ధాటికి చిరుగుటాకులా వణికిపోతుంది. రోజు రోజుకు అమెరికాలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యపు ధోరణితో తిరుగుతుండటం రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇంతకాలం కాస్త తగ్గుమొఖం పట్టిందనుకున్న కరోనా తీవ్రత పెరగటంతో అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలు, జనసమూహిక ప్రాంతాలకే పరిమితమైన వైరస్.. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత కారణంగా వైరస్ వేగంగా విస్తరిస్తుందంటున్నారు. ఇదే పరిస్థితి నెలకొంటే.. కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు.

అమెరికాలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. వైరస్ వల్ల ప్రతి రోజు అమెరికాలో వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు మరణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కోవిడ్ 19 వల్ల 2లక్షల 64వేల మందికిపైగా మరణించారు. రెండు నెలల్లోనే 64వేల మంది మరణించగా.. రానున్న నెల రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అమెరికా మృత్యు దిబ్బగా మారబోతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కలపై అమెరికా ప్రముఖ వైద్యుడు ఆంథోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విలయం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మరణాల సంఖ్య 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు గృహ రుణ ప్రయోజనాలు.. రూ.7 లక్షలు ఆదా
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
ఆస్తమా పేషెంట్స్ ఏది తినాలి..? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలంటే
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
అమ్మబాబోయ్.. ఇదేం అరాచకం..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోడీ..రాఖీ కట్టిన వృద్ధురాలు..ఓటర్లతో..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
చెన్నైకి బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
ఊటీ, కొడైకెనాల్ టూర్ వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిందే..
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
టాప్ 5లోకి దూసుకొచ్చిన హెడ్.. కోహ్లీకి చెక్ పెట్టిన రుతురాజ్
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
ఒకొక్క హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలుసా..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!
మోడీ సర్కార్‌ కీలక నిర్ణయం.. 11 నెలల తర్వాత నిషేధం ఎత్తివేత!