శ్రీరాముడి ప్రతిమ, సరయు జలాలతో ట్రినిడాడ్-టొబాగోలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్-టొబాకోలో పర్యటిస్తున్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ప్రధానికి ఆపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్తో పాటు 38 మంది మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. భోజ్పురి చౌతాలా కూడా పాడారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ భారతీయ సమాజాన్ని అయోధ్యను సందర్శించాలని ఆహ్వానించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో ఉన్నారు. ఆయన తన రెండవ దశ పర్యటనలో భాగంగా ట్రినిడాడ్-టొబాగో చేరుకున్నారు. ప్రధాని మోదీకి ట్రినిడాడ్-టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిస్సేస్సార్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు మొత్తంగా కేబినెట్ తోపాటు పార్లమెంటు సభ్యులు తరలి వచ్చారు. ఈ సమయంలో ప్రధాని కమలా భారతీయ సాంప్రదాయం చీర కట్టులో కనిపించారు. దీంతో పాటు, చాలా మంది ఎంపీలు భారతీయ దుస్తులు ధరించారు.
Landed in Port of Spain, Trinidad & Tobago. I thank Prime Minister Kamla Persad-Bissessar, distinguished members of the Cabinet and MPs for the gesture of welcoming me at the airport. This visit will further cement bilateral ties between our nations. Looking forward to addressing… pic.twitter.com/lyxxnKKfsR
— Narendra Modi (@narendramodi) July 3, 2025
ప్రధానమంత్రిగా ఆయన ఆ దేశానికి చేసిన తొలి పర్యటన ఇది. 1999 తర్వాత ట్రినిడాడ్ మరియు టొబాగోకు భారత ప్రధాని చేసిన తొలి పర్యటన ఇది. తన పర్యటన సందర్భంగా, భారత సమాజ ప్రజలను అయోధ్యకు రావాలని ప్రధాని ఆహ్వానించారు. ప్రధాని మోదీని స్వాగతించడానికి దేశంలో భారతదేశ సంస్కృతిని కూడా ప్రదర్శించారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ కొందరు భోజ్పురి చౌతల్ పాడారు. భోజ్పురి చౌతల్ అనేది భోజ్పురి ప్రాంతానికి చెందిన జానపద గీతం. దీనిని హోలీ లేదా ఫాగ్వా పండుగ సందర్భంగా పాడతారు.
A cultural connect like no other!
Very happy to have witnessed a Bhojpuri Chautaal performance in Port of Spain. The connect between Trinidad & Tobago and India, especially parts of eastern UP and Bihar is noteworthy. pic.twitter.com/O751WpAJc5
— Narendra Modi (@narendramodi) July 3, 2025
ట్రినిడాడ్-టొబాగోకు తన మొదటి అధికారిక పర్యటన సందర్భంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన భారతదేశంతో వారి సంబంధాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రధాని అయోధ్యలోని రామాలయం ప్రతిరూపాన్ని, సరయు నది పవిత్ర జలాన్ని తనతో తీసుకెళ్లారు. దీని గురించి, అయోధ్యలోని రామాలయం ప్రతిరూపాన్ని, సరయు నది పవిత్ర జలాన్ని నాతో తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని అన్నారు. అయితే, అంతకు ముందు భారతీయ సమాజం ఆలయ నిర్మాణం కోసం రాళ్ళు, పవిత్ర జలాన్ని పంపింది.
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ, ‘‘శ్రీరాముడిపై మీకున్న బలమైన విశ్వాసం నాకు తెలుసు. ఇక్కడి రామ లీలలు నిజంగా ప్రత్యేకమైనవి. శ్రీరాముని పవిత్ర నగరం చాలా అందంగా ఉందని, దాని కీర్తి ప్రపంచమంతటా కీర్తించబడుతుందని రామచరితమానస్ చెబుతోంది. 500 సంవత్సరాల తర్వాత రామ్ లల్లా అయోధ్యకు తిరిగి రావడాన్ని మీరందరూ స్వాగతించారని నాకు ఖచ్చితంగా తెలుసు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం మీరు పవిత్ర జలం, ‘శిల’ పంపారు. నేను కూడా అదే భావనతో ఇక్కడికి ఏదో తీసుకువచ్చాను. రామాలయం ప్రతిరూపాన్ని, పవిత్ర సరయు నుండి కొంత నీటిని తీసుకురావడం నాకు గౌరవంగా ఉంది’’ అని ప్రధాని మోదీ అన్నారు.
ట్రినిడాడ్-టొబాగోలోని భారతీయ సమాజాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘వారు గంగ, యమునలను విడిచిపెట్టారు, కానీ వారి హృదయాలలో రామాయణం ఉంది. వారు తమ నేలను విడిచిపెట్టారు, కానీ వారి ఆత్మను కాదు. ఎన్నారైలు అయ్యినందుకు గర్వంగా ఉందని అభివర్ణిస్తూ, మీలో ప్రతి ఒక్కరూ జాతీయ రాయబారి, భారతదేశ విలువలు, సంస్కృతి, వారసత్వానికి రాయబారి అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా, భారత సమాజ ప్రజలను అయోధ్యకు రావాలని ప్రధాని ఆహ్వానించారు. “రామమందిర ప్రతిరూపాన్ని, సరయు నది నీటిని అయోధ్యకు తీసుకురావడం నాకు దక్కిన గౌరవం” అని ప్రధాని అన్నారు. “సరయు జీ జలం, పవిత్ర సంగమం విశ్వాసం అమృతం. ఇది మన విలువలను, మన సంస్కారాలను శాశ్వతంగా సజీవంగా ఉంచే ప్రవహించే ప్రవాహం” అని అన్నారు. “మీరందరూ భారతదేశానికి రావాలని నేను వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నాను. మీ పూర్వీకుల గ్రామాలను సందర్శించండి. వారు నడిచిన నేలపై నడవండి. మీ పిల్లలను తీసుకురండి. మేము మీ అందరినీ ముక్తకంఠంతో, హృదయపూర్వకంగా జిలేబీలతో స్వాగతిస్తాము” అని ప్రధానమంత్రి అన్నారు.
#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago… We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c
— ANI (@ANI) July 4, 2025
ప్రధాని మోదీ ఈ రోజుల్లో ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మొదట ఘనా చేరుకున్నారు, అక్కడ ఆయన ఆ దేశ అగ్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. రెండు దేశాలు తమ సంబంధాలను సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాయి. దీని తర్వాత, ఆయన పోర్ట్ ఆఫ్ స్పెయిన్ చేరుకున్నారు. తన పర్యటన మూడవ దశలో, ప్రధాని మోదీ జూలై 4 నుండి 5 వరకు అర్జెంటీనాను సందర్శిస్తారు. తన పర్యటన నాల్గవ దశలో, మోదీ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి బ్రెజిల్కు వెళతారు. ఆ తర్వాత తిరిగి భారత్ పయనమవుతారు. తన పర్యటన చివరి దశలో, మోదీ నమీబియాను సందర్శిస్తారు.
Sharing some glimpses from the welcome at Port of Spain. May the friendship between India and Trinidad & Tobago continue to scale new heights in the times to come! pic.twitter.com/RkAW4pQBKw
— Narendra Modi (@narendramodi) July 3, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..