AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యుద్ధానికి పాశ్చాత్య దేశాలే కారణం.. అమెరికా మిత్రదేశాలకు చిత్తశుద్ది లేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు..

Russia President Putin: పాశ్చాత్యదేశాలు శాంతిని కోరుకోవడం లేదని, అందుకే ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికి రష్యా ఆర్ధికవ్యవస్థను ఏం చేయలేరని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సవాల్‌ విసిరారు.

యుద్ధానికి పాశ్చాత్య దేశాలే కారణం.. అమెరికా మిత్రదేశాలకు చిత్తశుద్ది లేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక వ్యాఖ్యలు..
Russia President Putin
Venkata Chari
|

Updated on: Feb 22, 2023 | 6:57 AM

Share

Russia President Putin: పాశ్చాత్యదేశాలు శాంతిని కోరుకోవడం లేదని, అందుకే ఉక్రెయిన్‌ను ఉసిగొల్పుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికి రష్యా ఆర్ధికవ్యవస్థను ఏం చేయలేరని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సవాల్‌ విసిరారు.

ఉక్రెయిన్‌ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. సమస్యను పరిష్కరించడానికి అమెరికా మిత్రదేశాలకు చిత్తశుద్ది లేదని, అందుకే ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఉక్రెయిన్‌లో పర్యటించడం.. 500 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించడాన్ని పుతిన్‌ తప్పుపట్టారు.

బైడెన్‌ ఉక్రెయిన్‌ పర్యటన తరువాత రష్యా మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదన్న బైడెన్‌ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. యుద్ద ప్రభావం రష్యా ఆర్ధికవ్యవస్థపై ఏమాత్రం లేదన్నారు. డాలర్‌ను బలహీనపర్చడమే తమ లక్ష్యమన్నారు పుతిన్‌. దశలవారిగా యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తమన్నారు. మరిన్ని అధునాతన ఆయుధాలను రష్యా ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు పుతిన్‌.

ఇవి కూడా చదవండి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడుతూ.. పరిస్థితి దిగజారడానికి పాశ్యాత్యదేశాలే వైఖరే కారణం…శాంతిని వాళ్లు కోరుకోవడం లేదు. అందుకే కొత్తగా ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల కుట్రలను తిప్పికొడుతాం. ఎన్ని ఆంక్షలు విధించినప్పటికి మా ఆర్ధికవ్యవస్థ పటిష్టంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకుంటామని అన్నారు పుతిన్‌. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు అణుబాంబును ఇస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి రష్యా ప్రజలు సిద్దంగా ఉండాలని సూచించారు. పుతిన్‌ హెచ్చరిస్తున్న సమయంలో ఉక్రెయిన్‌ సరిహద్దు లోని పోలండ్‌ పర్యటనలో ఉన్నారు బైడెన్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..