AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra S-400: రష్యా నుంచి మొదలైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా.. అమెరికా వ్యతిరేకతనూ పట్టించుకోని భారత్!

శత్రు యుద్ధ విమానాలను, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్థ్యం ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు సరఫరా చేయడం ప్రారంభించింది.

Brahmastra S-400: రష్యా నుంచి మొదలైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల సరఫరా.. అమెరికా వ్యతిరేకతనూ పట్టించుకోని భారత్!
Brahmastra S 400
KVD Varma
|

Updated on: Nov 15, 2021 | 12:09 PM

Share

Brahmastra S-400: శత్రు యుద్ధ విమానాలను, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్థ్యం ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు సరఫరా చేయడం ప్రారంభించింది. ఈ క్షిపణులను రష్యా నుంచి భారత్ పొందడం అమెరికాకు ఇష్టం లేదు. అయినా, భారత్ అమెరికా బెదిరింపులను పట్టించుకోకుండా 39 వేల కోట్లు వెచ్చించి ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య, ఆధునిక బ్రహ్మాస్త్ర అనే క్షిపణి వ్యవస్థలను పొందడం భారతదేశం సాధించిన గొప్ప విజయంగా పరిగణించవచ్చు. రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ ఈ విషయాన్ని దుబాయ్ ఎయిర్ షోలో ప్రకటించారు.

భారత్‌కు ఎస్-400 సిస్టమ్స్ సరఫరా ప్రారంభమైందని షుగేవ్ తెలిపారు. భారత రక్షణ శాఖనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని భాగాలు వాయుమార్గం, సముద్రం ద్వారా భారతదేశానికి చేరుకోవడం ప్రారంభించాయి. వాటిని ముందుగా పశ్చిమ సరిహద్దు దగ్గర మోహరిస్తారు. ఇక్కడ నుండి పాకిస్తాన్, చైనా రెండింటినీ ఎదుర్కోవడం సులభం అవుతుంది. మన దేశం కంటే ముందు ఈ రక్షణ వ్యవస్థ టర్కీ, చైనా సైన్య వ్యవస్థలో భాగం అయ్యాయి.

లడఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చైనా టిబెట్‌లో కూడా వీటిని మోహరించింది. 2018 అక్టోబర్‌లో 35,000 కోట్ల రూపాయల విలువైన ఎస్-400 సరఫరా చేసేందుకు భారత్, రష్యాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కింద 400 కి.మీల వరకు గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు ఐదు స్క్వాడ్రన్‌లను భారత్‌కు సరఫరా చేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి స్క్వాడ్రన్ సరఫరా పూర్తవుతుంది.

కాటసా నిషేధం అంటే ఏమిటి?

2016 నుండి పనిచేస్తున్న రష్యా నిర్మిత వైమానిక రక్షణ వ్యవస్థ S-400ని కొనుగోలు చేయాలనే భారతదేశ ప్రణాళికను అమెరికా వ్యతిరేకుల చట్టం (CAATSA)లోని సెక్షన్ 231 కింద అమెరికా నిరోధించవచ్చని CRS తెలిపింది. ఈ చట్టం ప్రకారం, రష్యాతో ఎలాంటి సైనిక లావాదేవీలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా తన మిత్రదేశాలను కోరింది. అలా చేయడంలో విఫలమైతే, ఈ దేశాలు తమ ప్రత్యర్థులను వ్యతిరేకించడానికి యూఎస్ సృష్టించిన శిక్షార్హమైన CAATSAని ఎదుర్కోవలసి వస్తుంది.

KATA ఆంక్షల బెదిరింపులు

S-400 సరఫరాతో, భారతదేశం ఇప్పుడు US CATA ఆంక్షల ముప్పులో ఉంది. వాస్తవానికి, ఈ అత్యాధునిక రష్యా రక్షణ వ్యవస్థను భారత్‌కు అందజేస్తే, అది కాటా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా పేర్కొంది. భారత్‌పై ఈ నిషేధం విధించకూడదని అమెరికాలో డిమాండ్ పెరుగుతోంది. స్వతంత్ర సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తన తాజా నివేదికలో, రష్యా ఆయుధ వ్యవస్థలపై భారతదేశం ఆధారపడటం సమీప భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!

PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ

New Technology: మీ పక్కన ఉన్నవారికి మీ స్మార్ట్‌ఫోన్‌‌లో మీరేమి చూస్తున్నారో కనిపించదు.. సరికొత్త టెక్నాలజీ రాబోతోంది.. తెలుసుకోండి!