PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ

దేశ సమగ్రాభివృద్ధిని ముక్కలు ముక్కలుగా చూడటం.. రాజకీయ కోణంలో పరిశీలించడం గతంలో ఉండేది. అందుకే మన ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని ప్రధాని మోడీ అన్నారు.

PMAY-G: గతంలో అభివృద్ధిని రాజకీయ కోణంలో చూసేవారు..అందుకే ఈశాన్యరాష్ట్రాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి.. ప్రధాని మోడీ
Pm Modi
Follow us

|

Updated on: Nov 14, 2021 | 2:33 PM

PMAY-G: దేశ సమగ్రాభివృద్ధిని ముక్కలు ముక్కలుగా చూడటం.. రాజకీయ కోణంలో పరిశీలించడం గతంలో ఉండేది. అందుకే మన ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది అని ప్రధాని మోడీ అన్నారు. త్రిపురలోని 1.47 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) మొదటి విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దీని కింద 700 కోట్లకు పైగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు, గత ప్రభుత్వాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ”అభివృద్ధి ఇప్పుడు దేశ ఐక్యత, సమగ్రతకు పర్యాయపదంగా మారింది. ఇంతకు ముందు మూసిఉన్న గదుల్లో పాలసీలు చేసేవారు. ఇప్పుడు ఢిల్లీఅనే కాకుండా స్థానిక అవసరాన్ని బట్టి పాలసీలు తయారవుతున్నాయి. త్రిపురలోని లక్షలాది కుటుంబాల ముందు పక్కా ఇళ్లకు సంబంధించి కొన్ని నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. అయితే, త్రిపుర భౌగోళిక పరిస్థితులను ప్రభుత్వం అర్థం చేసుకుంది. దానికి అనుగుణంగా విధానాలు రూపొందించింది.” అంటూ ప్రధాని మోడీ చెప్పారు.

త్రిపుర అభివృద్ధికి రాష్ట్రం-కేంద్రం కలిసి పని చేస్తున్నాయి..

ఇప్పుడు అగర్తలా, ఢిల్లీ రెండూ కలిసి విధానాలను రూపొందిస్తున్నాయని, కష్టపడి పని చేసి త్రిపుర అభివృద్ధికి ఫలితాలు తీసుకువస్తున్నాయని మోడీ అన్నారు. ”మీరు చూడండి, గత 4 సంవత్సరాలలో, త్రిపురలోని గ్రామాలలో సుమారు 50 వేల కుటుంబాలకు ప్రధానమంత్రి-ఆవాస్ పథకం కింద పక్కా గృహాలు ఇచ్చారు. దాదాపు 1.60 లక్షల కొత్త ఇళ్లు మంజూరయ్యాయి. ఈ రోజు మొదటి విడత కూడా దాదాపు 1.5 లక్షల కుటుంబాలకు విడుదల చేశాము. అది కూడా ఒక బటన్ నొక్కి.” అని ప్రధాని మోడీ అన్నారు.

PMAY-G పథకం అంటే ఏమిటి?

PMAY-G అనేది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటి. నిరాశ్రయులైన వారికి సొంత ఇళ్ళను అందించడమే దీని ఉద్దేశం. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..