Corona Virus: ఆ దేశ ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం.. మళ్ళీ విజృంబిస్తోన్న కరోనా.. వారం రోజులపాటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు

Corona Virus: రష్యాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా..

Corona Virus: ఆ దేశ ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం.. మళ్ళీ విజృంబిస్తోన్న కరోనా.. వారం రోజులపాటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు
Russia Covid 19
Follow us

|

Updated on: Oct 21, 2021 | 8:06 AM

Corona Virus: రష్యాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణ మృదంగం మ్రోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బాధితులు వెయ్యి మందికి పైగా మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఇలా భారీగా మరణాలు నమోదు కావడానికి ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం అనాలోచిత నిర్ణయాలు వలెనే అంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరోనా కట్టడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి నవంబర్ 7 వరకూ వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు రావొద్దని, ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించి వ్యాక్సిన్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా రష్యా స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ ను తయారు చేసి ఇతర దేశాలకు పంపిణి చేస్తున్నా.. అక్కడి ప్రజల్లో మాత్రం టీకాపై అనాసక్తి కనబరుస్తున్నారు.. దీంతో అక్కడి మరణల పెరుగుదలకు కారణమవుతుందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కరోనాను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే ప్రధాన అవకాశంగా పలుదేశాలు భావిస్తూ.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వ్హహిస్తున్నాయి.

గత 24 గంటల్లో 1,028 మంది కోవిడ్ -19తో మరణించారు. ఇది ఆ దేశంలో కరోనాతో ఈ రేంజ్ లో మరణించడం ఇదే మొదటిసారి. ఇక కొత్తగా 34,074 మందికి కరోనావైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. కరోనా మరణాల్లో రష్యా ఐరోపా దేశాల్లో మొదటి ప్లేస్ లో నిలిచింది. దీంతో మహమ్మారి తీవ్రతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని రష్యన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించింది. దీంతో మాస్కో మేయర్ సెర్గీ సోబయానిన్ మళ్ళీ కరోనా వైరస్ కట్టడి కోసం ఆంక్షలను విధించారు. రష్యా రాజధాని మాస్కో లో 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుండి పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పనిచేసే కార్మికులకు తప్పనిసరిగా టీకాలు ఇవాలని చెప్పారు. కోవిడ్ ఆంక్షలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని.. 2022 ఫిబ్రవరి చివరి వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాలలో వెళ్ళాలంటే యాక్సెస్ కోసం QR కోడ్‌లను అనేక ప్రాంతాలు తిరిగి ప్రవేశపెట్టాయి.

Also Read:  ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. నేడు ఏ రాశివారికి ఏవిధంగా ఉన్నదంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?