AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi China Visit: ఏడేళ్లకు అడుగుపెట్టిన మోదీకి చైనాలో రెడ్ కార్పెట్.. ఒకే వేదికపై ఆ ముగ్గురు..!

PM Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం చైనా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన. గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత 2020లో క్షీణించిన..

PM Modi China Visit: ఏడేళ్లకు అడుగుపెట్టిన మోదీకి చైనాలో రెడ్ కార్పెట్.. ఒకే వేదికపై ఆ ముగ్గురు..!
Subhash Goud
|

Updated on: Aug 30, 2025 | 4:54 PM

Share

ఆదివారం టియాంజిన్‌లో ప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర నాయకులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం చైనా, భారతదేశంపై అమెరికా చేస్తున్న సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా బల ప్రదర్శనగా ఉంటుంది. అయితే త్రైపాక్షిక సమావేశం ఉండదని వర్గాలు చెబుతున్నాయి. మోడీ-పుతిన్-జిన్‌పింగ్ మధ్య వన్-ఆన్-వన్ సమావేశం ఉండదు.

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం చైనా చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 2018 తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన. గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత 2020లో క్షీణించిన భారతదేశం – చైనా మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన చైనా రాక మరో అడుగు పడింది.

ఇవి కూడా చదవండి

మోదీకి రెడ్ కార్పెట్

టియాన్జియాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి ఘన స్వాగతం లభించింది. రెడ్ కార్పెట్ పరిచింది అక్కడి ప్రభుత్వం. ఓ దేశ ప్రధాని లేదా అధ్యక్షుడికి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడం అరుదు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ చైనాలో అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Modi China

ట్రంప్ సుంకాల వివాదం మధ్య శిఖరాగ్ర సమావేశం:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం, 50% సుంకం విధింపుతో న్యూఢిల్లీతో సహా వివిధ దేశాలు SCO – ప్రాంతీయ భద్రతా సమూహం – శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.

మోడీ-పుతిన్-జిన్‌పింగ్ ఒకే వేదికపై..

ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే పుతిన్ కు రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారులు చైనా, భారతదేశం. వేదికను పంచుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది. రష్యా ఇంధనం, రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేసినందుకు శిక్షగా ట్రంప్ విధించిన 25% అదనపు సుంకం భారతదేశాన్ని దెబ్బతీసింది. అయితే చైనాపై అలాంటి సుంకం విధించలేదు. రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని ట్రంప్ పరిపాలన ఒత్తిడిని ప్రధాన మంత్రి మోడీ ప్రతిఘటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..