AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imran Khan: భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని....

Imran Khan: భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Imran Khan
Ganesh Mudavath
|

Updated on: May 22, 2022 | 12:04 PM

Share

భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒత్తిడిని సైతం సమర్థంగా ఎదుర్కొని భారత్‌ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసిందని అన్నారు. తమ దేశ ప్రజలకు ధరాభారం నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఇమ్రాన్ పదవిలో ఉన్న సమయంలో భారత్ పై అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇండియా(India)ను సమర్థిస్తూ కామెంట్లు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండడం వల్లే అది సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ట్వీ్ట్ చేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక విదేశాంగ విధానం కోసం ప్రయత్నించినా స్థానిక మీర్‌ జాఫర్లు, మీర్‌ సాదిక్‌లు విదేశీ శక్తులకు తలొగ్గి అధికార మార్పిడికి కారణమయ్యారని వివరించారు. తద్వారా తలాతోక లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు.

అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. పెట్రోల్, డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల లీటర్ పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు లక్ష కోట్ల ఆదాయం కోల్పోతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

దేశంలో ద్రవ్యోల్బణం(inflation) పెరిగిపోవడంతో చమురు ధరలను తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. పెట్రోధరలు పెరగడంతో.. దాని ప్రభావం నిత్యావసర వస్తువులతో పాటు అన్ని వస్తువులపై కూడా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఓవైపు కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. పెట్రో బాదుడు కారణంగా బస్సు ఛార్జీలు, నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఊరటనిచ్చింది.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Viral Video: పడుకునే ముందు ఈ కుక్క చేసే పనిని చూస్తే బిత్తరపోతారు.. దీని తెలివికి హ్యట్సాఫ్‌ చెప్పాల్సిందే.. వీడియో వైరల్‌

Viral News: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి ..సింహంతో శునకం పోరాటం.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..