AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Attack: నైజీరియాలో ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి.. నేరస్తులకు శిక్ష తప్పదన్న గవర్నర్..

నైజీరియాలో ఉత్తర.. దక్షిణ నైజీరియా దేశాల మధ్య విభజన రేఖ ఉంది.. ఉత్తర నైజీరియాలో ముస్లింలు ఎక్కువగా ఉండగా.. దక్షిణ ప్రాంతాల మధ్య క్రైస్తవులున్నారు. దీంతో ఈ ప్రాంతం అనేక సంవత్సరాలుగా జాతి, మతపరమైన ఉద్రిక్తతలతో పోరాడుతోంది. అయితే ఈ దాడికి కారణమేమిటో, బాధ్యులెవరో తెలియరాలేదు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Nigeria Attack: నైజీరియాలో ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి.. నేరస్తులకు శిక్ష తప్పదన్న గవర్నర్..
Nigeria Attack
Surya Kala
|

Updated on: Dec 25, 2023 | 9:27 AM

Share

ఉత్తర మధ్య నైజీరియాలో  ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది మరణించారు. ఈ ఘటనపై పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు ఇక్కడ సర్వసాధారణమని ఆర్మీ ఆదివారం తెలిపింది. పీఠభూమి రాష్ట్రంలోని ముషు గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాడి జరిగిందని కెప్టెన్ ఓయా జేమ్స్ AFPకి తెలిపారు. నైజీరియాలో ఉత్తర.. దక్షిణ నైజీరియా దేశాల మధ్య విభజన రేఖ ఉంది.. ఉత్తర నైజీరియాలో ముస్లింలు ఎక్కువగా ఉండగా.. దక్షిణ ప్రాంతాల మధ్య క్రైస్తవులున్నారు. దీంతో ఈ ప్రాంతం అనేక సంవత్సరాలుగా జాతి, మతపరమైన ఉద్రిక్తతలతో పోరాడుతోంది.

అయితే ఈ దాడికి కారణమేమిటో, బాధ్యులెవరో తెలియరాలేదు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ప్రాంతం పశువుల కాపరులు (ముస్లింలు), రైతులు (క్రైస్తవులు) మధ్య తరచుగా ఘర్షలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రదేశంలో హత్యలు జరగడం సర్వాధారణంగా గుర్తించబడింది. తరచుగా భారీగా సాయుధ ముఠాలు గ్రామాలపై దాడి చేస్తాయి.

దాడిని ఖండించిన గవర్నర్

ఈ దాడిని రాష్ట్ర గవర్నర్ కాలేబ్ ముతాఫ్వాంగ్ ఖండించారు. ఇది అనాగరికం, క్రూరమైన చర్యగా అభివర్ణించారు. బాధితులకు న్యాయం చేస్తామని.. నేరస్తులకు శిక్ష తప్పదని చెప్పారు. అమాయక పౌరులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ  ప్రతినిధి గ్యాంగ్ బెరే విలేకరులతో అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..