AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 72 మంది మృతి.. ఇందులో నలుగురు భారతీయులు

నేపాల్‌లోని పోఖారాలో ఈరోజు ఓ విమానం కుప్పకూలింది. విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 72 మంది చనిపోయినట్లుగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 72 మంది మృతి.. ఇందులో నలుగురు భారతీయులు
Nepal Plane Crash
Sanjay Kasula
|

Updated on: Jan 15, 2023 | 3:32 PM

Share

నేపాల్‌లోని పోఖారాలో జరిగిన ప్రమాదంలో బాధితులైన యతి ఎయిర్‌లైన్స్ విమానంలో కనీసం 5 మంది భారతీయ ప్రయాణీకులు కూడా ఉన్నారు. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా 72 మందితో వెళ్తున్న విమానం పోఖారా విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో  మొత్తం 72 మంది చనిపోయినట్లుగా ప్రకటించింది నేపాల్ ప్రభుత్వం నిర్ధారించబడింది. విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు భారతీయుల గురించి టీవీ 9 సమాచారం సేకరించింది. విమానంలో ఉన్న ఐదుగురు భారతీయుల పేర్లు సంజయ్ జైస్వాల్, సోనూ జైస్వాల్, అనిల్ కుమార్ రాజ్‌భర్, అభిషేక్ కుష్వాహా, విశాల్ శర్మ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ టీవీ 9 న్యూస్‌కు తెలిపింది.

ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నేపాల్ అడ్మినిస్ట్రేషన్, యెతి ఎయిర్‌లైన్స్‌తో కూడా టచ్‌లో ఉంది.

విమాన ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇలా..

దేశరాజధాని ఖాట్మాండు నుంచి పొకారా వెళ్తున్న విమానం ల్యాండింగ్‌ సమయంలో విమానం క్రాష్‌ అయ్యింది. ప్రమాదం జరిగిన -విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు యెతీ ఎయిర్‌లైన్స్‌ వెల్లడించింది. నలుగురు రష్యా పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదానికి ముందు విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్‌కు కేవలం 10 సెకన్ల ముందు ప్లేన్‌ క్రాష్‌ అయ్యింది.

ఈ విమానం ఇళ్లపై కూలుతుందని అందరూ భయపడ్డారు. కాని కొండను ఢీకొట్టి ఎయిర్‌పోర్ట్‌ సమీపం లోనే కుప్పకూలింది. ఈ విమానంలో 53 మంది నేపాల్‌ పౌరులు , 15 మంది విదేశీయులు ప్రయానం చేశారు.

పోకారా ఎయిర్‌పోర్టులో దిగుతుండగా విమానం కుప్పకూలింది. కొత్త ఎయిర్‌పోర్టు, పాత ఎయిర్‌ పోర్టు మధ్యలో నదిలో విమానం కుప్పకూలింది. ల్యాండింగ్‌ టైమ్‌లో విమానంలో మంటలు చెలరేగాయి

ఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని ప్రచండ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ల్యాండింగ్‌ కంటే ముందు విమానంలో మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. యెతీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9N-ANC ATR-72 విమానం ఖాట్మాండు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉదయం 10.33 గంటలకు బయలుదేరింది. తరువాత కుప్పకూలింది. పొకారా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో కొండను ఢీకొట్టి ఈ విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది.

యెతీ ఎయిర్‌లైన్స్‌ను నేపాల్‌లో 12 రోజుల క్రితమే ప్రారంభించారు. ప్రమాదానికి గురైన విమానం చైనాలో తయారైనట్టు తెలుస్తోంది. నేపాల్‌లో పొకారా పెద్ద టూరిస్ట్‌ కేంద్రం. సేతీ నది పక్కనే ఈ ఘోర విమాన ప్రమాదం జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Follow Us
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
శ్రీకాకుళం టు హైదరాబాద్.. గ్రూప్స్ కోచింగ్ కోసం వచ్చి..
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
9 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రైళ్లల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారికి అలర్ట్
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
రాత్రిళ్లు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగ..బాలెనో కారులో వచ్చి చోరీలు
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
ఒమన్‌లో వాణిజ్య నౌకపై దాడి ముగ్గురు మిస్సింగ్
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
రాత్రిళ్లు గోళ్లు కత్తిరించొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
వర్షాలు కురుస్తున్నాయ్.. ఏ నేలలో.. ఏ పంట సాగు చేయాలి..?
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
12 ఏళ్లలో స్పష్టమైన మార్పు చూపించాం.. ప్రధాని మోదీ
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
మూడేళ్లకోసారి వచ్చే ఈ అరుదైన ఏకాదశి రోజున ఇలా పూజిస్తే.. ఐశ్వర్యం
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!