AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతిలో తుపాకీ, ఒంటిపై సైనిక యూనిఫాం.. దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చిన ఇరాన్‌ ఇమామ్!

ఇరాన్‌లోని ఖోరామాబాద్ నగరంలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఒక విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇమామ్ సైనిక యూనిఫాం ధరించి తన శుక్రవారం ప్రసంగం చేశారు. అతను చేతిలో తుపాకీ పట్టుకుని మరీ ప్రసంగించాడు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ శైలిలో ఇమామ్ ప్రసంగం చేయడమంటే, దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రజలు ఐక్యంగా ఉండాలని ఇమామ్ సందేశం ఇచ్చారు.

చేతిలో తుపాకీ, ఒంటిపై సైనిక యూనిఫాం.. దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చిన ఇరాన్‌ ఇమామ్!
Imams Friday Message In Iran
Balaraju Goud
|

Updated on: Mar 06, 2026 | 8:27 PM

Share

ఇరాన్‌లోని ఖోరామాబాద్ నగరంలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఒక విచిత్రమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇమామ్ సైనిక యూనిఫాం ధరించి తన శుక్రవారం ప్రసంగం చేశారు. అతను చేతిలో తుపాకీ పట్టుకుని మరీ ప్రసంగించాడు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ శైలిలో ఇమామ్ ప్రసంగం చేయడమంటే, దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రజలు ఐక్యంగా ఉండాలని ఇమామ్ సందేశం ఇచ్చారు.

ఇదిలావుంటే, మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమవుతోంది. శుక్రవారం (మార్చి 06), ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ రాజధానులపై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ సైన్యం టెహ్రాన్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడ్డట్లు తెలిపింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాడులు చాలా శక్తివంతమైనవి, అవి చుట్టుపక్కల ప్రాంతంలోని ఇళ్లను కదిలించాయి. అనేక క్షిపణి స్థావరాలకు నిలయమైన ఇరాన్ నగరం కెర్మాన్‌షా సమీపంలో కూడా అనేక పేలుళ్లు సంభవించాయని సమాచారం.

ఇజ్రాయెల్ సైన్యం తమ దాడులు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను, క్షిపణి లాంచర్లను నాశనం చేశాయని పేర్కొంది. అదే సమయంలో, అమెరికా కూడా ఇరానియన్ డ్రోన్ క్యారియర్‌ను లక్ష్యంగా చేసుకుని చర్యకు దిగింది. ఈ నౌక ఐఆర్ఐఎస్ షాహిద్ బాఘేరి, ఇది మార్చిన కంటైనర్ షిప్ అని యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు.. ఆ నౌకలో డ్రోన్ ప్రయోగాల కోసం 180 మీటర్ల పొడవైన రన్‌వే ఉంది. దాడి తర్వాత ఓడ మంటల్లో చిక్కుకుంది. ఈ వారం ప్రారంభంలో, శ్రీలంక తీరంలో ఒక US జలాంతర్గామి ఒక ఇరానియన్ యుద్ధనౌకను ముంచివేసింది. ఈ ఘటేనలో 87 మంది ఇరానియన్ నావికులు మరణించారు.

మరోవైపు, అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇస్తున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంటోంది. అయితే, ప్రాథమిక నివేదికలు ఎటువంటి పెద్ద నష్టం జరగలేదని సూచించాయి. అటు లెబనాన్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దక్షిణ బీరుట్‌లో ఇజ్రాయెల్ అనేక వైమానిక దాడులను ప్రారంభించింది, దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు భద్రత కోసం పారిపోయారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఇరుపక్షాలకు ఉద్రిక్తతలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. మంటలు వ్యాపించకుండా ప్రపంచం తక్షణ చర్య తీసుకోవాలని ఆయన అన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us