Flights: భారత్‌కు వస్తుండగా.. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. అప్పుడేమైందంటే..?

India Flights: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారత్‌కు వచ్చే రెండు విమానాలు టేకాఫ్‌ సమయంలో

Flights: భారత్‌కు వస్తుండగా.. ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. అప్పుడేమైందంటే..?
International Flights
Follow us

|

Updated on: Jan 14, 2022 | 7:59 PM

India Flights: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. భారత్‌కు వచ్చే రెండు విమానాలు టేకాఫ్‌ సమయంలో ఒకే రన్‌వేపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన గత ఆదివారం (జనవరి 9న) జరిగింది.

దబాయ్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో రన్‌ వే 30ఆర్‌ పైకి అది సమీపిస్తోంది. ఇంతలో దుబాయ్‌ నుంచి బెంగళూరు వెళ్లే మరో ఎమిరేట్స్ విమానం ఈకే-568 అదే రన్‌వేపై టేకాఫ్‌ కోసం వేగంగా దూసుకువచ్చింది. ఈ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ ఏటీసీ అప్రమత్తమై వెంటనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లే విమానం టేకాఫ్‌ను వెంటనే నిలిపివేసినట్లు తెలిపారు.

అయితే.. ఏటీసీ గుర్తించకపోతే పెను ప్రమాదం జరిగేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విమానయాన సంస్థలు కూడా స్పందించాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

Modi Government: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రయాణికులకు మరింత భద్రత

Omicron Variant: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పిల్లలపై ప్రభావం ఎక్కువ: ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌..!