AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్‌ అధికారులు జాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు: భారత రాయబారి

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా పాక్ సబ్‌ జైలులో ఉన్న జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ […]

పాక్‌ అధికారులు జాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు: భారత రాయబారి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 03, 2019 | 8:11 AM

Share

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌పై ఆ దేశ అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తప్పుడు ఆరోపణలు ఆయనపై మోపిన పాక్.. వాటిని అంగీకరించాలని ఒత్తిడి తెస్తోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిష్ కుమార్ తెలిపారు. ఆయనను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాగా పాక్ సబ్‌ జైలులో ఉన్న జాదవ్‌ను సోమవారం మధ్యాహ్నం భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ ఆహ్లూవాలియా కలిశారు. ఈ సందర్బంగా గంటపాటు జాదవ్‌తో సమావేశం కొనసాగింది.

మరోవైపు జాదవ్ విషయంలో ఒక సమగ్ర నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని రావిష్ కుమార్ తెలిపారు. ఆయన విషయంలో విదేశీ వ్యవహారాల ఇంఛార్జ్ నుంచి వివరణాత్మక నివేదికను స్వీకరించడంతో పాటు,ఐసిజె ఆదేశాలను బట్టి ఎంతవరకు అనుగుణంగా ఉందో నిర్ణయించిన తరువాతే తదుపరి చర్యను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. జాదవ్ త్వరగా న్యాయం పొందేలా, ఆయనను త్వరగా స్వదేశానికి తిరిగి వచ్చేలా కృషి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రావిష్ కుమార్ పేర్కొన్నారు.