కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు సాయం.. బహ్రెయిన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత్

కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ దేశం చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయులకు సాయం.. బహ్రెయిన్ కు కృతజ్ఞతలు తెలిపిన భారత్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 4:29 PM

కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ దేశం చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖమంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ విస్తరిస్తున్న సమయంలో భారతీయులకు ఉచిత వైద్యం అందిచడంతో పాటు.. స్వదేశాయానికి తిరిగి పంపడంలోనూ ఆ దేశం చూపిన చొరవకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారం తదితర విషయాలపై చర్చలు జరిగినట్లు మంత్రి తెలిపారు. అలాగే, నవంబర్ 11న మరణించిన బహ్రెయిన్ ప్రధాని షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మృతికి జయశంకర్ సంతాపం ప్రకటించారు. భారతీయుల తరఫున బహ్రెయిన్ ప్రజలు, అధికారులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ బహ్రెయిన్‌తో పాటు యూఏఈ, సీషెల్స్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఇక బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారం ఆ దేశం మొత్తం జనాభా 14 లక్షల్లో సుమారు 3.50 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..