AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Student: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని వెంటాడి దాడి చేసిన నలుగురు దుండగులు

అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలోని తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దుండగులు దాడి చేసి గాయపరిచారు. విపరీతంగా రక్తస్రావంతో ఉన్న విద్యార్థిని దొంగలు తీవ్రంగా కొట్టారని, తన ఫోన్ లాక్కెళ్లారని ఓ వీడియోలో పేర్కొన్నారు.

Hyderabad Student: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని వెంటాడి దాడి చేసిన నలుగురు దుండగులు
Hyderabad Student Chased
Balaraju Goud
|

Updated on: Feb 07, 2024 | 11:09 AM

Share

అమెరికాలో భారత్‌కు చెందిన విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలోని తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దుండగులు దాడి చేసి గాయపరిచారు. విపరీతంగా రక్తస్రావంతో ఉన్న విద్యార్థిని దొంగలు తీవ్రంగా కొట్టారని, తన ఫోన్ లాక్కెళ్లారని ఓ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ సంతతి విద్యార్థులు శవమై కనిపించిన నేపథ్యంలో ఈ దాడి ఆందోళన రేకెత్తించింది.

హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మజాహిర్ అలీ ఇండియానా వెస్లియన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అమెరికా వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున చికాగోలోని క్యాంప్‌బెల్ అవెన్యూలోని అతని ఇంటి సమీపంలో అలీని ముగ్గురు దుండగు లు వెంబడించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఫుడ్ ప్యాకెట్‌తో ఇంటికి తిరిగి వస్తున్న తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని అలీ తెలిపారు. కింద పడిపోయిన తనను నలుగురు వ్యక్తులు తన్నడం, తీవ్రంగా కొట్టారన్నారు. ఈ దాడిపట్ల అలీ కుటుంబం, అతని భార్య, ముగ్గురు మైనర్ పిల్లలు ఆందోళన చెందుతున్నారు.

గత వారం, ఒహియోలోని లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 19 ఏళ్ల తెలుగు విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగర్ శవమై కనిపించాడు. శ్రేయాస్ తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, అతను అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నాడు. ఈ కేసులో అక్రమాలకు తావులేదని అధికారులు తేల్చిచెప్పారు. అదే వారంలో, పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య చనిపోయాడు. యూనివర్శిటీ క్యాంపస్‌లో ఆచార్య అనుమానాస్పదస్థితిలో మృతదేహం కనుగొనడం జరిగింది. అలాగే హర్యానాకు చెందిన వివేక్ సైనీ జనవరి 16న జార్జియాలోని లిథోనియాలో నిరాశ్రయుడైన వ్యక్తి కొట్టి చంపాడు. MBA చదువుతున్న సైనీ, నిరాశ్రయులైన వ్యక్తి ఆశ్రయం పొందుతున్న ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేసింది. జనవరి 16న, ఫాల్క్‌నర్‌కు ఉచితంగా ఆహారం ఇవ్వడానికి నిరాకరించాడని హతమార్చాడు.

మరో భారతీయ విద్యార్థి అకుల్ ధావన్ జనవరిలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-ఛాంపెయిన్ వెలుపల శవమై కనిపించాడు. పోస్ట్‌మార్టం నివేదిక18 ఏళ్ల యువకుడు అల్పోష్ణస్థితితో మరణించాడని సూచించగా, అతని తల్లిదండ్రులు అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు దాఖలు చేశారు. విశ్వవిద్యాలయ పోలీసు విభాగం నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయినట్లు ఆరోపించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి