Indian Embassy: ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి.. భారత మారిటైమ్ యూనియన్ చొరవతో విడుదల

ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి కలిగింది. పోర్ట్ సిటీ బుషెహర్‌లో పాస్‌పోర్ట్ లేకపోవడంతో 2019 సంవత్సరం నుండి కార్గో షిప్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు భారతీయ నావికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో విడుదల చేశారు.

Indian Embassy: ఇరాన్‌లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి.. భారత మారిటైమ్ యూనియన్ చొరవతో విడుదల
Iran
Follow us

|

Updated on: Feb 12, 2022 | 6:49 AM

Two Indians Released by Indian Embassy: ఇరాన్‌(Iran)లో చిక్కుపోయిన ఇద్దరు భారతీయులకు విముక్తి కలిగింది. పోర్ట్ సిటీ బుషెహర్‌(Port City of Bushehr)లో పాస్‌పోర్ట్ లేకపోవడంతో 2019 సంవత్సరం నుండి కార్గో షిప్‌లో చిక్కుకుపోయిన ఇద్దరు భారతీయ నావికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో విడుదల చేశారు . భారత మారిటైమ్ యూనియన్ (MUI) శుక్రవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. అయినప్పటికీ, MUI దావా స్వతంత్రంగా ధృవీకరించలేదు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఇద్దరు నావికులకు ప్రయాణ పత్రాలను జారీ చేసింది.MUI శనివారం ముంబైకి వారి విమాన టిక్కెట్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత మారిటైమ్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది.

MUI ప్రకారం, భారతీయ నావికులు అర్హమ్ షేక్, ఆశిష్ సక్పాల్ బందర్ అబ్బాస్ పోర్ట్‌లోని కార్గో నౌకలో పని కోసం 2019 సెప్టెంబర్‌లో టూరిస్ట్ వీసాపై ముంబై నుండి ఇరాన్‌కు బయలుదేరారు. ముంబైలోని ఒక ఏజెన్సీ ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. ఈ నావికులు ఇరాన్‌లోని కార్గో షిప్‌కి చేరుకున్న తర్వాత, ఓడ యజమాని, అతని స్థానిక ఏజెంట్ ఈ వ్యక్తుల పాస్‌పోర్ట్‌లను తీసుకున్నారు. అనంతరం వారిద్దరూ పాస్‌పోర్టులు పోగొట్టుకున్నారని చెప్పారు. దీని తరువాత, ‘సీ ప్రిన్సెస్’ అనే ఈ ఓడ వారికి కదిలే జైలుగా మారింది. ఓడ యజమాని ఇద్దరు నావికులకు సరియైన ఆహారం, నీరు ఇచ్చేవారు కాదని, అలాగే ఈ వ్యక్తులు ఓడలో విద్యుత్ లేకపోవడం వల్ల వారి కుటుంబాలతో సంబంధాలు కోల్పోయారు. దీంతో ఇద్దరు నావికులు, వారి కుటుంబాలు 2020లో MUI నుండి సహాయం కోరారు. చివరికి, MUI సెక్రటరీ జనరల్ అమర్ సింగ్ ఠాకూర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ ఖాన్ టెహ్రాన్‌లోని భారత రాయబారిని, న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని, ఇతరులను సంప్రదించినట్లు ప్రకటన తెలిపింది.

ఇరాన్‌పై ఆంక్షలపై అమెరికా మెతక వైఖరి భారతదేశానికి చాలా సానుకూల దశగా మారింది. ఆంక్షల ఎత్తివేత మొదటి సానుకూల సంకేతం బ్రెంట్ క్రూడ్ ధరలలో పతనం రూపంలో కనిపించింది. ఇరాన్ నుంచి ఆంక్షల ఎత్తివేతతో ముడిచమురు సరఫరా పెరుగుతుందని, ఇది భారత్ కు ఊరటనిచ్చే అంశమని మార్కెట్ కు కూడా అర్థమవుతోందని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. దీనితో పాటు, భారతదేశం, ఇరాన్ మధ్య వాణిజ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. దానిపై ఆంక్షల ప్రభావం కనిపించింది. కొత్త మార్పులతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరోసారి ఊపందుకుంటుందని అంచనా.

Read Also….  IPL 2022 Auction Live Streaming: మెగా వేలం లైవ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి? పూర్తి వివరాలు మీకోసం..