AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కాట్లాండ్‌లో దారుణ ఘటన.. ట్రెక్కింగ్ వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..

బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటి మునిగి మరణించారు. వారి మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీసినట్లు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అలాగే డూండీ విశ్వవిద్యాలయం సాధ్యమైన అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది.

స్కాట్లాండ్‌లో దారుణ ఘటన.. ట్రెక్కింగ్ వెళ్లి నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
Andhra Pradesh Students
Surya Kala
|

Updated on: Apr 19, 2024 | 2:47 PM

Share

అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే పలువురు భారతీయ స్టూడెంట్స్ మరణిస్తున్నారు. తాజాగా స్కాట్లాండ్‌లో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. 22 , 27 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో బుధవారం ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో శవమై కనిపించారు. బుధవారం రాత్రి లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం నుండి అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జలపాతాలు స్కాట్లాండ్ వాయువ్య దిశలో ఉన్నాయి. ఇక్కడ గ్యారీ, తుమ్మెల్ నదులు కలుస్తాయి.

సమాచారం ప్రకారం డూండీ యూనివర్సిటీలో చదువుకున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. వీరిలో ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఈ రోజు భారత్ కు రానున్న మృత దేహాలు

బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటి మునిగి మరణించారు. వారి మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీసినట్లు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి తెలిపారు. భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలతో టచ్‌లో ఉన్నారు. ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అలాగే డూండీ విశ్వవిద్యాలయం సాధ్యమైన అన్ని విధాల సహాయం చేస్తుందని హామీ ఇచ్చింది. ఏప్రిల్ 19న పోస్ట్‌మార్టం నిర్వహించి అనంతరం మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి కృషి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు ఏమని చెప్పారంటే..

స్కాట్లాండ్ కు చెందిన పోలీసు: బుధవారం సాయంత్రం 7 గంటలకు బ్లెయిర్ అథోల్ సమీపంలోని లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద నీటిలో ఇద్దరు వ్యక్తులు నీటిలో పడి మునుగినట్లు తమకు సమాచారం అందింది.  ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను నీటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే  అంశంపై పరిశీలన సాగుతోంది.. అయితే ఈ మరణాలకు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద ఘటనలు  వెలుగులోకి రాలేదని చెప్పారు. ప్రొక్యూరేటర్ ఫిస్కల్ (స్కాట్లాండ్‌లో జరిమానా విధించే అధికారాలు కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్)కి ఒక నివేదిక సమర్పించనున్నామని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..