AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ అందుకేనా..?

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటినోవ్‌స్కీ ప్యాలెస్‌లో భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? పుతిన్‌తో అజిత్ దోవల్ భేటీ అందుకేనా..?
Ajit Doval Meet Vladimir Putin
Balaraju Goud
|

Updated on: Sep 12, 2024 | 8:50 PM

Share

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటినోవ్‌స్కీ ప్యాలెస్‌లో భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరోసారి కజాన్‌లో ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అక్టోబరు 22న కజాన్‌లో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను.” అని పుతిన్ అన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవిష్యత్తులో తీసుకోవల్సిన అవకాశాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ దోవల్ ప్రధాని తరపున కృతజ్ఞతలు తెలిపారు. తన ఇటీవల ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్న నరేంద్ర మోదీ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

NSA దోవల్ తనను వ్యక్తిగతంగా కలిసే అరుదైన అవకాశాన్ని కల్పించినందుకు రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. టెలిఫోన్ సంభాషణలో ప్రధాని చెప్పినట్లుగా, ఉక్రెయిన్ పర్యటన, జెలెన్స్కీతో సమావేశం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని దోవల్ చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా వచ్చి దాని గురించి చెప్పాలనుకున్నారు. అనుహ్యంగా తాను రావల్సి వచ్చిందన్నారు. ఈ సంభాషణ క్లోజ్డ్ ఫార్మాట్‌లో జరిగింది. ఇద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. ప్రధానితో ఉన్నాను, ఈ సంభాషణకు నేనే సాక్షి అని దోవల్ పుతిన్‌కు వివరించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం (సెప్టెంబర్ 12) ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పెరుగుతున్న ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని మరోసారి ప్రశంసించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ భారత్‌ను ప్రశంసించారు.

తమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుందని, మరింత బలపడుతోందని రష్యా పుతిన్ స్పష్టం చేశారు. దాని గురించి మేము సంతోషంగా ఉన్నామన్నారు. భారతదేశం బలపడుతుండటం, దాని ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ విజయం సాధ్యమని పుతిన్ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
జుట్టు ఒత్తుగా పెరగాలా.. అమ్మమ్మల కాలం నాటి అద్భుతమైన చిట్కా..
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
ఐపీఎల్ 2026లో కుర్రాళ్లకు చుక్కలు చూపించే టాప్-5 సీనియర్లు వీళ్లే
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
బాలయ్య అంతే మరి.. సినిమా అంటే ప్రాణమిస్తాడు..
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి