US VISA: ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారతీయులకు ప్రాధాన్యత..

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ వీసాల జారీ కోసం వేచి ఉండే కాలాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వీసాల జారీలో జాప్యం కారణంగా..

US VISA: ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారతీయులకు ప్రాధాన్యత..
US Visa
Follow us

|

Updated on: Nov 11, 2022 | 7:49 AM

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వారికి ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికన్ వీసాల జారీ కోసం వేచి ఉండే కాలాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. వీసాల జారీలో జాప్యం కారణంగా కోవిడ్ తర్వాత అమెరికా వెళ్లాలనుకునేవారు నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం వీసాల జారీని వేగవంతం చేయనున్నట్లు ప్రకటించడంతో అమెరికా వెళ్లాలనుకునే వారికి మంచి అవకాశం లభించనుంది. అమెరికా వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం భవిషత్యులో తగ్గే అవకాశం ఉందని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారతీయులకు ప్రతినెలా లక్ష వీసాలను మంజూరు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. గత ఏడాది 82 వేల వీసాలివ్వగా.. వచ్చే ఏడాది జూన్‌ నాటికి 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వీసాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. వీసాల మంజూరు విషయంలో భారత దేశమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. వీసాల జారీ విషయంలో కోరానాకు ముందున్న పరిస్థితులను వచ్చే ఏడాది మధ్య నాటికి తీసుకురావాలనేది తమ లక్ష్యమని వెల్లడించింది.

వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సుదీర్ఘ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు డ్రాప్‌ బాక్స్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. డ్రాప్‌ బాక్స్‌ విధానం ద్వారా వీసా రెన్యువల్ సులభం కానుంది. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు దీనికి అర్హులు కానున్నారు. భారతీయులకు హెచ్‌ 1బి, ఎల్‌ కేటగిరీ వీసాల మంజూరును ప్రాధాన్య అంశంగా అమెరికా గుర్తించింది. విద్యార్థి వీసాల జారీ సమయాన్ని.. ముఖ్యంగా రెన్యువల్‌ సమయాన్ని తగ్గించడాన్ని కూడా ప్రాధాన్యంగా పెట్టుకున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. వీసా రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవల దాదాపు లక్ష స్లాట్లను విడుదల చేసినట్లు పేర్కొంది.

కొన్ని వీసాల మంజూరుకు గతంలో 450 రోజులు పడుతుండగా.. దానిని 9 నెలలకు తగ్గించామని తెలిపింది. బీ1, బీ2 వీసాల మంజూరు సమయాన్ని మరింత తగ్గించినట్లు పేర్కొంది. అమెరికా వీసాలు పొందుతున్న దేశాల్లో త్వరలోనే భారత్‌ రెండో స్థానంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం మెక్సికో, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. అమెరికాలో చదువుకునే విద్యార్థుల వీసాల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, వీసాల పునరుద్ధరణ కోసం చూస్తున్న వారికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..