Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dawood Ibrahim: రెండో వివాహం చేసుకున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌..! వధువు పాకిస్థానీ పఠాన్‌ !!

పాకిస్థాన్‌ పఠాన్‌ మహిళను దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు అలీ షా పార్కర్‌ అధికారుల ముందు వెల్లడించాడని సమాచారం. అయితే, ఈ కేసు దర్యాప్తు సందర్భంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ నమోదు చేసింది.

Dawood Ibrahim: రెండో వివాహం చేసుకున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌..! వధువు పాకిస్థానీ పఠాన్‌ !!
Dawood Ibrahim
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2023 | 7:56 PM

పరారీలో ఉన్న అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్‌ ఇబ్రహీం పాకిస్థానీ పఠాన్ మహిళను మళ్లీ పెళ్లి చేసుకున్నాడని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దావూద్‌ సోదరి హసీనా పార్కర్ కుమారుడు, దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దావూద్‌ మొదటి భార్య మైజాబిన్‌ను గతంలోనే వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్‌ పఠాన్‌ మహిళను దావూద్‌ రెండో పెళ్లి చేసుకున్నట్లు అలీ షా పార్కర్‌ అధికారుల ముందు వెల్లడించాడని సమాచారం. అయితే దావూద్‌ తన మొదటి భార్య మైజాబిన్‌కు విడాకులు ఇవ్వలేదని తెలిపాడు.

ఉగ్రవాద నిధుల కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో, అలీషా తన ప్రకటనలో దావూద్ కుటుంబ వివరాలను వెల్లడించాడు. అందులో గ్యాంగ్‌స్టర్ తన స్థావరాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలోని మరొక ప్రదేశానికి మార్చుకున్నాడని ఎన్‌ఐఏ నివేదికలో వెల్లడించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి కొందరిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఐఏకు సమాచారం అందింది. వారు పెద్ద నగరాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉందని… ఈ కేసు దర్యాప్తు సందర్భంగా దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ వాంగ్మూలాన్ని ఎన్ఐఏ నమోదు చేసింది.

అలీషా ప్రకటన ప్రకారం, దావూద్‌కు నలుగురు సోదరులు, అతనితో సహా ఐదుగురు కుటుంబ సభ్యులు. దావూద్ ఇబ్రహీం మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అతని రెండవ భార్య పాకిస్తానీ పఠాన్” అని అలీషా ఎన్‌ఐఏ విచారణలో చెప్పాడు. ప్రస్తుతం అతను కరాచీలోని డిఫెన్స్ కాలనీలో ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడు’ అని అలీ షా ఎన్‌ఐఏ అధికారుల విచారణలో వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..