బాకీ కడతావా.. జైలు కెళ్తావా..? అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్..!

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించడం లేదంటూ చైనా బ్యాంకులు వేసిన పటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 20లోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపింస్తామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

బాకీ కడతావా.. జైలు కెళ్తావా..? అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్..!
Follow us

|

Updated on: Jul 03, 2020 | 7:12 PM

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి లండన్ కోర్టు షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించడం లేదంటూ చైనా బ్యాంకులు వేసిన పటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ నెల 20లోపు ఆదాయ, వ్యయాల వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే ఆస్తులు జప్తు చేసి జైలుకు పంపింస్తామంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. లక్ష డాలర్లకు పైగా విలువ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది.

భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీ తమకు 717 మిలియన్ డాలర్ల అంటే దాదాపు రూ.5,354 కోట్లు విలువైన బాకీలను చెల్లించడం లేదంటూ మూడు చైనా బ్యాంకులు లండన్ లోని మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు అనిల్ అంబానీకి ఆదేశాలు జారీ చేసింది. బ్యాలకు రుణపడి ఉన్న అప్పులను చెల్లించాలంటూ ఈ ఏడాది మే నెలలోనే జస్టిస్ నిగెల్ టియర్ తీర్పు నిచ్చారు. అయితే, ఆర్‌‌కామ్ కోసం అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని బ్యాంకులు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఖండించిన అనిల్.. బాకీ చెల్లించే స్తోమత లేదని వాదిస్తున్నారు. 2008 వరకు ఇండియాలోనే ఆరో పెద్ద సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం తన నెట్‌‌వర్త్ విలువ సున్నాకు చేరిందని ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆడిట్ అఫిడవిట్ ను కోర్టుకు అందజేశారు. అయితే, కోర్టు మాత్రం అంబానీ వాదనతో విబేధిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వెంటనే కట్టాలని ఆదేశించింది.