AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lottery News: కొడుకు చెప్పాడని లాటరీ టికెట్ కొంది..ఇంటికి వచ్చిన అతిథి తెచ్చిన లక్షలను చూసి అవాక్కయింది!

అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో తెలీదు. ఒక్కోసారి చెప్పాపెట్టకుండా వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అందులోనూ లాటరీ టికెట్ల నుంచి వచ్చే అదృష్టం కథ వేరేగా ఉంటుంది.

Lottery News: కొడుకు చెప్పాడని లాటరీ టికెట్ కొంది..ఇంటికి వచ్చిన అతిథి తెచ్చిన లక్షలను చూసి అవాక్కయింది!
Lottery News
KVD Varma
|

Updated on: Nov 14, 2021 | 10:29 AM

Share

Lottery News: అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో తెలీదు. ఒక్కోసారి చెప్పాపెట్టకుండా వచ్చేసి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అందులోనూ లాటరీ టికెట్ల నుంచి వచ్చే అదృష్టం కథ వేరేగా ఉంటుంది. ఎదో బలవంతంగా ఓ టికెట్ కొన్నపుడో.. చిల్లర లేదని దుకాణం వాడు అంతకట్టిన లాటరీ టికెట్ కో.. ఒక్కోసారి అమ్మకుండా మిగిలిపోయిన లాటరీ టికెట్ తోనో అదృష్టం అకస్మాత్తుగా ధనలక్ష్మిని నట్టింటిలోకి తెచ్చిపాడేస్తుంది. అటువంటిదే ఇప్పుడు ఓ లాటరీ కథ గురించి చెప్పబోతున్నాం. లాటరీ టికెట్ అంటేనే తెలీని ఓ మహిళ తన కోడుకు కొనమని అడుగుతున్నాడని ఓ టికెట్ కొని పెట్టుకుంది. ఈ మొత్తం కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తల్లి ఇంతకు ముందు ఎప్పుడూ లాటరీ టిక్కెట్ కొనలేదు. కొడుకు కోరికతో మొదటిసారి టిక్కెట్టు కొని రాత్రికి రాత్రే లక్షలకు యజమానురాలు అయింది. అక్కడి మీడియా సమాచారం ప్రకారం, ఇంగ్లాండ్‌లోని మెర్సీసైడ్‌కు చెందిన 60 ఏళ్ల కాథ్లీన్ మిల్లర్, ఆమె 35 ఏళ్ల కుమారుడు పాల్ ఇద్దరూ పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీని ఆడారు. దీంతో జాక్‌పాట్ గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు.

కుమారుడి ఒత్తిడితో..

ఈ లాటరీని గెలుచుకున్న తర్వాత, కాథ్లీన్ మాట్లాడుతూ- నా కొడుకు పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీని తరచు ఆడేవాడు. అతను ఒకరోజు దానిని ఆడమని నన్ను ఒప్పించాడు. మనసు లేకుండా టిక్కెట్టు కొన్నాను. లాటరీ టిక్కెట్టు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ లాటరీ తగిలిన తర్వాత, నేను అతని మాటకు అంగీకరించి ఈ గేమ్ ఆడినందుకు సంతోషంగా ఉంది అని చెప్పింది.

పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీ అంబాసిడర్ మాట్ జాన్సన్ ప్రైజ్ మనీ గురించి కాథ్లీన్ ఇంటికి చేరుకున్నపుడు ఆమె షాక్ అయింది. జాన్సన్ స్వయంగా వెళ్లి పారితోషికం చెక్కును తల్లీకొడుకులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”రివార్డ్‌ను పంచుకోవడానికి ఇది ఎప్పుడూ ఉత్తేజకరమైన సమయం. తల్లీ కొడుకులతో టీ తాగిన తర్వాత వారి భవిష్యత్తు ప్రణాళికల గురించి విన్నాం.” అంటూ చెప్పారు.

క్రీడలకు ఎంత డబ్బు ఖర్చు చేస్తారు

పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీని ఆడేందుకు నెలకు సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందని, ఇందులో ప్రతిరోజు ఎవరైనా ఖచ్చితంగా గెలుస్తారని మాట్ జాన్సన్ చెప్పారు. వ్యక్తులు ఎంచుకున్న పోస్ట్‌కోడ్‌లతో ఆడతారు. అన్ని డ్రాలు స్వయంచాలకంగా నమోదు చేయబడతాయి. ఇంకా, ఈ బహుమతి పీపుల్స్ పోస్ట్‌కోడ్ లాటరీ ప్రత్యేక క్రిస్మస్ ప్రచారంలో భాగమని, ఇందులో లక్కీ డ్రా సమయంలో టిక్కెట్‌కు 30 లక్షల రూపాయల విజేత పేరు డ్రా చేయబడిందని మాట్ జాన్సన్ చెప్పారు. ప్రతి టిక్కెట్‌లో కనీసం 33% స్వచ్ఛంద సంస్థకు వెళుతుంది.

ఇవి కూడా చదవండి: Crypto Currency: అక్రమ క్రిప్టో ఎక్స్ఛేంజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి..అధికారులను కోరిన ప్రధాని మోడీ

Amit Shah: అమిత్ షా ఆంధ్రా పర్యటన.. మూడురోజుల పాటు బిజీ బిజీగా గడపనున్న కేంద్ర హోం మంత్రి!

Sharia Law: కఠినమైన షరియా చట్టం అమలుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధం.. ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తాలిబన్ ప్రభుత్వం!

Follow Us