AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫ్ఘన్ దళాల దాడుల్లో 30 మంది పాకిస్తానీ అల్-ఖైదా ఉగ్రవాదుల మృతి… ఇంకా..

ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా తాలిబాన్లపై విరుచుకపడ్డాయి. తాము జరిపిన వైమానిక దాడుల్లో 112 మంది తాలిబన్ టెర్రరిస్టులు మరణించారని..వీరిలో 30 మంది అల్-ఖైదా పాక్ ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆఫ్ఘన్ దళాల దాడుల్లో 30 మంది పాకిస్తానీ అల్-ఖైదా ఉగ్రవాదుల మృతి... ఇంకా..
Taliban Terrorists Killed By Afghan Forces
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 08, 2021 | 10:01 AM

Share

ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా తాలిబాన్లపై విరుచుకపడ్డాయి. తాము జరిపిన వైమానిక దాడుల్లో 112 మంది తాలిబన్ టెర్రరిస్టులు మరణించారని..వీరిలో 30 మంది అల్-ఖైదా పాక్ ఉగ్రవాదులు ఉన్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 31 మంది గాయపడినట్టు పేర్కొంది. హెల్మండ్ ప్రావెన్షియల్ సెంటర్ లోని లష్కర్ ఘర్ సిటీ శివార్లలో ఈ దాడులు జరిగినట్టు తెలియజేసింది. 2019 లో అల్-ఖైదా నేత ఆసి ఉమర్ మరణించిన తరువాత ఒసామా మహమూద్ ఆధ్వర్యాన ఈ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను సాగిస్తోంది.ఈ గ్రూప్ లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా మయన్మార్ సభ్యులు కూడా ఉన్నారు. మరో వైపు తాలిబన్లు కూడా ఆఫ్గనిస్తాన్ లో తమ పోరును ఉధృతం చేస్తున్నారు. ఈ నెల మొదటి 5 రోజుల్లో తాలిబన్ల దాడుల్లో 115 మంది ఆఫ్ఘన్ సైనికులు, 58 మంది పౌరులు మరణించారు. కాంగ్ జిల్లాలో 30 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి చెందారు. తమకు లొంగిపోతున్నవారిని కూడా తాలిబన్లు వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లాలో ఓ పోలీసు అధికారి సహా ఆరుగురు ఆఫ్ఘన్ సైనికులు లొంగిపోయినప్పటికీ వారిని కాల్చి చంపారు.

హెల్మండ్ ప్రావిన్స్ లో 20 మంది పౌరులు మరణించగా సుమారు 190 మంది గాయపడ్డారు. ఈ నెల 5 న జోజియన్ ప్రావిన్స్ లో తాలిబాన్లకు, ఆఫ్ఘన్ దళాలకు మధ్య కొన్ని గంటల పాటు పోరు సాగింది. ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ లో సుమారు 400 జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రొవిన్షియల్ రాజధానులను సైతం వశపరచేందుకు యత్నిస్తున్నారు. ఈ నెల 6 న కాబూల్ లోని మసీదు వద్ద ప్రభుత్వ మీడియా హెడ్ ను వారు కాల్చి చంపారు. మరిన్ని ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. ఆఫ్ఘన్ లోని పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి న్యూయార్క్ లో సమావేశమై చర్చిస్తోంది. ఈ నెల 11 న రష్యా.. ఖతార్ లో మూడు దేశాలతో సమావేశమై.. ఈ సమస్యకు ఓ రాజీ సూత్రాన్ని కనుగొనేందుకు ప్రతిపాదించింది. అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఒలంపిక్స్ లో మెరిసిన భారతీయ తేజాలు.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఏం చేశారంటే ..?

Dog Shopping: ఇది మామూలు శునకం కాదోచ్.. ఆర్డరిస్తే చాలు.. వెంటనే తెచ్చేస్తుంది..

Follow Us
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
తొలి మ్యాచ్‌లో తుస్సు మనిపించిన వైభవ్..!
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ 'యాష్ ట్రే' ఎందుకు?
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
ఓరీ దేవుడో.. గర్భనిరోధక ఇంజెక్షన్ తీసుకుంటే కంటి చూపు గోవిందా!
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
పా..పా..పాము పార్క్‌ చేసిన బైక్‌లోకి దూరి హల్‌చల్‌..జరిగింది ఇదే
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
బంగారం ధరలను రోజూ ఎవరు డిసైడ్ చేస్తారు..? గంటల్లోనే రేట్లు..
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
మంచు కొండలను చీల్చుకుంటూ శాశ్వత పరిష్కారం ‘జోజిలా టన్నెల్’!
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ఒక కప్పు పచ్చి శనగపప్పు.. రెండు టమాటాలతో కర్రీ చేస్తే చపాతీల్లోకి
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
ప్రభాస్ ఎవరు..? అని అడిగినందుకు...
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
శుక్రుడి కటాక్షం.. ఇక వారి జీవితంలో కొత్త వెలుగులు ఖాయం..!
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?
పర్సనల్ లోన్ తీసుకువాలంటే ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించాలా..?