AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Posani Krishnamurali: రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని..

Ravi Kiran
|

Updated on: Nov 21, 2024 | 8:20 PM

Share

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు వీడ్కోలు పలకడమే కాదు.. ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని.. తనకు ఏపార్టీతోనూ సంబంధం లేదని వెల్లడించారు. ఇక జీవితంలో ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని తెలిపారు. ఏ పార్టీ గురించి, నాయకుడి గురించి రాజకీయాలు మాట్లాడనని పోసాని కృష్ణమురళీ చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై అనుచిత విమర్శలు చేశారని ఆరోపిస్తూ గత కొద్దిరోజులుగా ఆయనపై ఏపీవ్యాప్తంగా కూటమి నేతలు కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. కాగా, పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా పని చేశారు.