ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది.

ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

|

Updated on: Mar 21, 2024 | 8:32 PM

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది. ప్రపంచం ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధన వినియోగం పెరుగుదలే దీనికి కారణమని, వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయనీ ఈ భూగ్రహం మనకు ఒక విపత్తు సందేశాన్ని పంపుతోందని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఒక్కటి మీ ఆహారంలో చేర్చుకోండి.. నిద్రలేమినుంచి గుండె జబ్బుల వరకు పరార్‌

పెద్ద శబ్దంతో పేలిన ఈ – బైక్‌ బ్యాటరీ.. ముగ్గురికి గాయాలు

ఆహారం కోసం వచ్చి కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి..

చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్..అరుణాచల్ ప్రదేశ్‌ భారత్ దే

కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

Follow us