Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాకుంభమేళాలో హెలికాఫ్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే ??

మహాకుంభమేళాలో హెలికాఫ్టర్ సేవలు.. టికెట్ ధర ఎంతంటే ??

Phani CH

|

Updated on: Feb 19, 2025 | 8:45 PM

మహాకుంభమేళాలో కోట్ల మంది భక్తులు పాల్గొంటున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్య నుంచి భక్తులను బయటపడేసేందుకు యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది. ఒక్కో ప్రయాణికుడు 35 వేల రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే హెలికాప్టర్‌ ఛార్జీ, బోట్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఇతర సేవలు కూడా ఇస్తారు.

హెలికాప్టర్‌ సేవలు ఉపయోగించుకోవాలంటే ముందుగానే ఫ్లై ఓలా వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 44 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అయితే.. దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వంద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యిందని.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌ పోర్టు నుంచి త్రివేణి సంగమం వరకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. కోడలికి హెచ్‌ఐవీ వైరస్ ఉన్న ఇంజెక్షన్‌ ఇచ్చి

మీ వయసును తగ్గించే ఆహారాలు ఇవే.. మీ ముఖంలో ఎప్పటికీ యవ్వనపు మెరుపు

Rashmika Mandanna: ‘ఊరిస్తూ.. ఇంకెన్నాళ్లు ఈ ప్రేమాయణం’

Manchu Manoj: సంచలన వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్‌

Chhaava: సంచలనంగా ఛావా కలెక్షన్స్‌ !! కోట్లు కొల్లగొడుతున్న బాలీవుడ్ మూవీ..!