AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం

గోదావరిలో పడవలతో చిరంజీవి పేరు.. ఆకట్టుకున్న దృశ్యం

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 4:21 PM

Share

తూర్పుగోదావరి రాజమండ్రి పుష్కరాల రేవులో చిరంజీవి యువత ఆధ్వర్యంలో 'మన శంకర వరప్రసాద్' సంబరాలు ఘనంగా జరిగాయి. గోదావరిలో బోట్లతో చిరంజీవి పేరు ఆవిష్కరణ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తిని కొనియాడారు. జనవరి 7న మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రికి రానున్నారని సమాచారం.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాల రేవులో రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో మన శంకర వరప్రసాద్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోదావరి నదిలో బోట్లతో చిరంజీవి పేరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన రాజమండ్రి MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసి, కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే… చిరంజీవిగారు ఆయన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని, మెగా అభిమానులు అందరికి స్ఫూర్తి అని అన్నారు. అనంతరం మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఉదయ్ రాజు సత్తి రెడ్డి తో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 40 పడవలతో పుష్కర ఘాట్ గోదావరి మధ్యలో సంబరాలు నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి .. మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీన మన సంకర వరప్రసాద్ సినిమా టీం తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రాజమండ్రి పుష్కర ఘాటుకు సినిమా సంబరాల్లో పాల్గొంటారని సినీ వర్గాల టాక్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sravana Bhargavi: భాగస్వామి సపోర్ట్‌ లేనప్పుడు.. ఇలాగే జరుగుతుంది !!

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

Bala Krishna: NBK111 సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు.. నిజంగా అలా ఉండబోతుందా

Allu Arjun: కెరీర్ కోసం కత్తిలాంటి ప్లానింగ్.. అల్లు అర్జున్ అంటే ఆమాత్రం ఉంటది

మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది