AP News: ఎలారా ఇలా.! పైకి చూస్తే పైపుల లోడ్.. తీరా లోన చెక్ చేయగా మైండ్ బ్లాంక్..

ఏరా..! మీరు మారరా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. ఊసలు లెక్కట్టించినా.. వార్నింగ్‌లు ఇచ్చినా.. మళ్లీ తమ వంకర బుద్దిని బయటపెడుతున్నారు కేటుగాళ్లు. పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. రాష్ట్రమంతటా ప్రహారిలా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Follow us

|

Updated on: May 09, 2024 | 12:05 PM

ఏరా..! మీరు మారరా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా.. ఊసలు లెక్కట్టించినా.. వార్నింగ్‌లు ఇచ్చినా.. మళ్లీ తమ వంకర బుద్దిని బయటపెడుతున్నారు కేటుగాళ్లు. పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. రాష్ట్రమంతటా ప్రహారిలా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. అక్రమంగా మద్యం, డబ్బు, బంగారం, వెండిని రవాణా చేయకుండా అడ్డుకట్టు వేస్తున్నారు పోలీసులు. అయితేనేం నగదు తరలింపు ఆగట్లేదు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా డబ్బు పట్టుబడింది. ‘పుష్ప’ సినిమా తరహలో లారీలో తరలిస్తున్న సుమారు రూ. 8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ-తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో.. పోలీసులకు ఓ పైపుల లోడ్ తీసుకెళ్తున్న లారీపై అనుమానమొచ్చింది. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా.. ఆ లారీ క్యాబిన్‌లో సెపరేట్‌ అరలో ఐదు కవర్ బ్యాగులు దర్శనమిచ్చాయి. ఇక వాటిని ఓపెన్ చేయగా.. భారీగా నోట్ల కట్టలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మెదక్ నుంచి గుంటూరుకు ఈ డబ్బును తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.