AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఎయిర్ పోర్ట్‌లో మ్యాగీ మసాలా ధర చూసి మహిళ షాక్.. ప్లేట్ మ్యాగీ ధర రూ.193..

మ్యాగీ కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మ్యాగీ ప్యాకెట్ ధర రూ.10లుండేది. తర్వాత దీని ధర రూ.12కి పెరిగింది. ఇప్పుడు దీని ధర రూ.14కి పెరిగింది. అయితే ఎప్పుడైనా మ్యాగీ ప్యాకెట్ ధర రూ.180-190ఉంటుందని ఊహిచారా..!  అవును ఎయిర్‌పోర్ట్‌లో మ్యాగీ ధర వందకు పైగా ఉండి అందరికీ షాక్ ఇచ్చింది.   

Viral News: ఎయిర్ పోర్ట్‌లో మ్యాగీ మసాలా ధర చూసి మహిళ షాక్.. ప్లేట్ మ్యాగీ ధర రూ.193..
Maggi For Rs 193
Surya Kala
|

Updated on: Jul 17, 2023 | 7:12 PM

Share

మ్యాగీ ప్రస్తుతం చిన్న పెద్దలకు ఇష్టమైన ఆహారంగా మారింది. ఆకలి అనిపించిన వెంటనే చాలు వెంటనే మ్యాగీ వైపు దృష్టి సారిస్తారు. కనుక ఇది ఆకలిని తక్షణమే తగ్గించే ఆహారంగా మారింది. మ్యాగీ తయారీకి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకా చెప్పాలంటే మ్యాగీ కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మ్యాగీ ప్యాకెట్ ధర రూ.10లుండేది. తర్వాత దీని ధర రూ.12కి పెరిగింది. ఇప్పుడు దీని ధర రూ.14కి పెరిగింది. అయితే ఎప్పుడైనా మ్యాగీ ప్యాకెట్ ధర రూ.180-190ఉంటుందని ఊహిచారా..!  అవును ఎయిర్‌పోర్ట్‌లో మ్యాగీ ధర వందకు పైగా ఉండి అందరికీ షాక్ ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ రూ.193కి మసాలా మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌ను తిని, దాని బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. మ్యాగీ ధర ఇంత ఎక్కువగా ఉంటుందా అంటూ తమని తామే ప్రశ్నించుకుంటున్నారు.. ఆ ధర విషయం నమ్మలేకపోతున్నారు. బిల్లులో మసాలా మ్యాగీ ధర రూ.184 .. జీఎస్టీని జోడించిన తర్వాత దాని ధర రూ.193 అయింది. మ్యాగీ తిన్న తర్వాత ఆ మహిళ UPI ద్వారా  చెల్లించింది. మ్యాగీ బిల్లు తీసుకున్న తర్వాత ఆమె మొదట దాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్ ఐడిలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ మహిళ పేరు సెజల్ సూద్. ఈ బిల్లును ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సెజల్ ఇలా రాశారు, ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో రూ. 193కి మ్యాగీని కొనుక్కున్నాను. ఖరీదు చూసి ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదని చెప్పింది. అంతేకాదు ఎవరైనా ఇంత ఎక్కువ ధరకు మ్యాగీని ఎందుకు విక్రయిస్తారు. ఈ బిల్లును చూసిన ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారని ఒకరు అడిగారు. దానికి సమాధానంగా, సెజల్ తనకు రెండు గంటల నుంచి ఆకలిగా ఉందని.. అందుకే కొనవలసి వచ్చిందని చెప్పింది.

అదే సమయంలో, మరొకరు మాట్లాడుతూ, ‘ఇండిగో విమానాలలో కూడా ఇది రూ. 250కి అమ్ముతున్నారు అని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారుల జేబులు ఖాళీ కాకుండా ఉండడానికి..  ఆకలిని తీర్చడానికి ధరలపై పరిమితి విధించాలని కోరుతున్నాడు. ఇంకొకరు తాము విమానంలో ప్రయాణించే సమయంలో ఇంటి నుండి ఆహారంతీసుకుని వెళ్తున్నామని.. ఈ ధరలను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా సింపుల్‌గా.. మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి!
ఇలా సింపుల్‌గా.. మీకు గ్రాట్యూటీ ఎంత వస్తుందో మీరే లెక్కించండి!
ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా?ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా
ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా?ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా
దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
దేవుడి పేరుతో హత్యలు.. OTT టాప్ ట్రెండింగ్ లో క్రైమ్ థ్రిల్లర్
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
భారత్‌ అమెరికా ట్రేడ్‌ డీల్‌.. వారికి లాభాల పంట!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
ఇంట్లో దైవ శక్తి పెరగాలంటే ఈ 4 పనులు తప్పనిసరి!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
ఈ టీతో బీపీ, వెయిట్ లాస్, కీళ్ల నొప్పులు అన్నింటికీ చెక్ పెట్టండి
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్