AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్‌ ఫోన్‌ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు.

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..
Tihar Jail
Basha Shek
|

Updated on: Jan 07, 2022 | 5:44 PM

Share

ఓ ఖైదీ ఎలాగోలా మొబైల్‌ ఫోన్‌ సంపాదించాడు. ఎంచక్కా కొద్ది రోజుల పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. అయితే ఖైదీ దగ్గర మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు, రోజూ కాల్స్‌ చేసి మాట్లాడుతున్నాడని జైలు అధికారులకు తెలిసిపోయింది. ఆ ఖైదీపై నిఘా పెట్టారు. అతని దగ్గర ఫోన్‌ ఉందని నిర్ధారణ చేసుకున్నారు. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుందామని ఖైదీ ఉన్న బ్యారక్‌ దగ్గరకు వెళ్లారు. అయితే జైలు అధికారులు వస్తున్నారన్న విషయం ఖైదీకి తెలిసిపోయింది. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర భయాందోళన మధ్య మొబైల్‌ ఫోన్‌ను మింగేశాడు. ఢిల్లీలోని తిహార్‌ జైలులో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయెల్‌ వెల్లడించారు.

ఇంకా ఖైదీ కడుపులోనే ఫోన్‌.. కాగా ఫోన్‌ మింగిన ఖైదీని చికిత్స నిమిత్తం వెంటనే దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు జైలు అధికారులు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కాగా మొబైల్‌ ఫోన్‌ ఇంకా ఖైదీ కడుపులోనే ఉందని, దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Also Read:

Tamilnadu: జ్యోతిష్కుడిని నమ్మి కూతురును కడతేర్చిన తల్లి.. ఆపై ఏం జరిగిందంటే..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..

Kurnool: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫుడ్‌ ఫాయిజన్‌.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత..