AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కంటే ఖరీదైన పురుగు! దీని ప్రత్యేకత, అసలు ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!!

బంగారం ధర రోజురోజుకీ ఆకాశాన్నంటుతోంది. దీనివల్ల సామాన్య ప్రజలకు బంగారం కొనడం చాలా కష్టంగా మారింది. కానీ, ప్రపంచంలో బంగారం కంటే విలువైన ఒక కీటకం ఉందని మీకు తెలుసా? ఇంతకీ, బంగారం కంటే విలువైన ఆ కీటకం ఏది? దాని ప్రత్యేకత ఏంటి అన్నది తెలియాలంటే.. పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

బంగారం కంటే ఖరీదైన పురుగు! దీని ప్రత్యేకత, అసలు ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!!
Yarsagumba Cordyceps Sinensis
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2026 | 9:11 PM

Share

ప్రపంచంలో బంగారం లేదా వజ్రాలు అత్యంత ఖరీదైనవిగా మనం భావిస్తుంటాం. కానీ, హిమాలయ ప్రాంతాల్లో లభించే ఒక అరుదైన పురుగు ధర బంగారం కంటే చాలా ఎక్కువ. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అది చూడటానికి చనిపోయిన పురుగు లేదా కీటకంలా కనిపిస్తుంది. దాని పేరే యార్సాగుంబ. శాస్త్రీయంగా దీనిని కార్డిసెప్స్ సినెన్సిస్ అని పిలుస్తారు. భారతదేశంలో దీనిని సాధారణంగా కీడా జడీ అని, అంతర్జాతీయంగా హిమాలయన్ వియాగ్రా అని పిలుస్తారు.

యార్సాగుంబ ఎలా తయారవుతుంది?:

యార్సాగుంబ అనేది సగం పురుగు, సగం మూలిక. శీతాకాలంలో హిమాలయ మంచు కొండల కింద ఉండే కొన్ని రకాల గొంగళి పురుగుల లార్వాల శరీరంలో ఒక ప్రత్యేక ఫంగస్ చేరి ప్రాణాలను తీస్తుంది. మంచు కరిగే వేసవి కాలంలో ఆ చనిపోయిన పురుగు తల భాగం నుండి ఫంగస్ ఒక చిన్న మొక్క/కాడ రూపంలో బయటకు పెరుగుతుంది. స్థానికులు మంచు కొండలపైకి వెళ్ళి ఎంతో శ్రమించి ఈ మూలికను సేకరిస్తారు.

ఇవి కూడా చదవండి

ఔషధ గుణాలు, ఉపయోగాలు:

సాంప్రదాయ చైనీస్ వైద్యం, ఆయుర్వేదంలో యార్సాగుంబను వందల సంవత్సరాలుగా ఒక శక్తివంతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరంలో స్టామినా, ఉత్సాహాన్ని పెంచి, నపుంసకత్వాన్ని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే దీనికి హిమాలయన్ వియాగ్రా అనే పేరు వచ్చింది.

ఇది శరీర ఇమ్యూనిటీని గణనీయంగా పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది.

బంగారం కంటే ఎక్కువ ధర ఎందుకు?:

యార్సాగుంబను కృత్రిమంగా ల్యాబ్‌లలో పెంచడం సాధ్యం కాదు. ఇది కేవలం సముద్ర మట్టానికి 3,000 నుండి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే హిమాలయ పర్వత శ్రేణులలో మాత్రమే సహజంగా పెరుగుతుంది. దీని లభ్యత చాలా తక్కువగా ఉండటం, డిమాండ్ విపరీతంగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్లో దీని ఒక కిలో ధర రూ. 20 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంటుంది. అత్యంత అరుదైన నిర్మాణం, విపరీతమైన ఔషధ విలువల వల్లే ఈ చిన్న పురుగు బంగారం కంటే విలువైనదిగా గుర్తింపు పొందింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!
ఈ నెలంతా వారికి లక్ష్మీ కటాక్షం..ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్..!
ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్
‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య బర్త్‌డే నాడే టెకీ ఆత్మహత్య
‘సారీ రాధికా.. గుడ్‌బై’.. భార్య బర్త్‌డే నాడే టెకీ ఆత్మహత్య
విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్
విమర్శలు చూసి తట్టుకోలేక భారత్ పేరు లాగిన పీసీబీ చీఫ్
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..
డాబాపై చిన్నారి ఏడుపు.. వెళ్లి చూడగా షాక్! ఫోన్‌లో మాట్లాడుతూనే..
డాబాపై చిన్నారి ఏడుపు.. వెళ్లి చూడగా షాక్! ఫోన్‌లో మాట్లాడుతూనే..
అదుపు తప్పి బావి వైపు కెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు
అదుపు తప్పి బావి వైపు కెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !
మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !