AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ.

Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం
Maggi Case
Jyothi Gadda
|

Updated on: May 30, 2022 | 5:00 PM

Share

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మైసూరులోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం ఎల్‌ రఘునాథ్‌ బళ్లారిలో జిల్లా జడ్జిగా ఉన్నప్పటి వృత్తాంతాన్ని తాజాగా బయటపెట్టారు. దాంతో విషయం వైరల్‌గా మారింది.

చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకులు కోరే కేసులపై లాయర్‌ రఘునాథ్ మాట్లాడుతూ..ఓ మ్యాగీ కేసును గురించి వివరించారు. అతను బళ్లారిలో జిల్లా న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుండి ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును గుర్తుచేసుకున్నాడు. ఓ వ్యక్తి ఒక విచిత్ర కేసును తన వద్దకు తీసుకొచ్చినట్టుగా చెప్పాడు. ఆ కేసును జడ్జీ మ్యాగీ కేసుగా పిలుచుకునేవారని గుర్తు చేసుకున్నారు. అతడు తన భార్యకు వంటరాదని, కేవలం తన భార్య తక్షణ నూడుల్స్ మాత్రమే వండగలదని తెలుసుకున్న ఓ భర్త కోర్టును ఆశ్రయించి విడాకులు కోరాడు. మైసూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని “మ్యాగీ కేసు” అని పిలిచారు. బాధితుడి భార్య అతనికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం మూడు పూటల మ్యాగీనే వడ్డించేదని కంప్లైట్‌ చేశాడు. అలాంటి మహిళతో తనకు విడాకులు ఇప్పించాలని కోరినట్టుగా జడ్జీ రఘునాథ్‌ వివరించారు. ఆ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏళ్లుగా విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. విడాకులు తీసుకోవడానికి ముందు జంటలు కనీసం ఒక సంవత్సరం పాటు కలిసి ఉండవలసి ఉంటుంది,” అని జడ్జీ ఎంఎల్‌ రాఘునాథ్‌ పేర్కొన్నారు. రాజీ, తిరిగి కలుసుకోవడం ద్వారా జంటలు తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులు సెంటిమెంట్‌ను ఎలా ఉపయోగిస్తాయో దాని గురించి సవవిరంగా వివరించారు. చాలా వరకు, సమస్యలు శారీరకం కంటే మానసికంగా ఉంటాయన్నారు. చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకుల కోసం దాఖలు చేసే మ్యాట్రిమోనియల్ కేసులపై విలేకరుల సమావేశంలో ఇదంతా వెల్లడించారు జడ్జీ రఘునాథ్‌.

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!