AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ.

Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం
Maggi Case
Jyothi Gadda
|

Updated on: May 30, 2022 | 5:00 PM

Share

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మైసూరులోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం ఎల్‌ రఘునాథ్‌ బళ్లారిలో జిల్లా జడ్జిగా ఉన్నప్పటి వృత్తాంతాన్ని తాజాగా బయటపెట్టారు. దాంతో విషయం వైరల్‌గా మారింది.

చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకులు కోరే కేసులపై లాయర్‌ రఘునాథ్ మాట్లాడుతూ..ఓ మ్యాగీ కేసును గురించి వివరించారు. అతను బళ్లారిలో జిల్లా న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుండి ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును గుర్తుచేసుకున్నాడు. ఓ వ్యక్తి ఒక విచిత్ర కేసును తన వద్దకు తీసుకొచ్చినట్టుగా చెప్పాడు. ఆ కేసును జడ్జీ మ్యాగీ కేసుగా పిలుచుకునేవారని గుర్తు చేసుకున్నారు. అతడు తన భార్యకు వంటరాదని, కేవలం తన భార్య తక్షణ నూడుల్స్ మాత్రమే వండగలదని తెలుసుకున్న ఓ భర్త కోర్టును ఆశ్రయించి విడాకులు కోరాడు. మైసూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని “మ్యాగీ కేసు” అని పిలిచారు. బాధితుడి భార్య అతనికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం మూడు పూటల మ్యాగీనే వడ్డించేదని కంప్లైట్‌ చేశాడు. అలాంటి మహిళతో తనకు విడాకులు ఇప్పించాలని కోరినట్టుగా జడ్జీ రఘునాథ్‌ వివరించారు. ఆ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏళ్లుగా విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. విడాకులు తీసుకోవడానికి ముందు జంటలు కనీసం ఒక సంవత్సరం పాటు కలిసి ఉండవలసి ఉంటుంది,” అని జడ్జీ ఎంఎల్‌ రాఘునాథ్‌ పేర్కొన్నారు. రాజీ, తిరిగి కలుసుకోవడం ద్వారా జంటలు తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులు సెంటిమెంట్‌ను ఎలా ఉపయోగిస్తాయో దాని గురించి సవవిరంగా వివరించారు. చాలా వరకు, సమస్యలు శారీరకం కంటే మానసికంగా ఉంటాయన్నారు. చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకుల కోసం దాఖలు చేసే మ్యాట్రిమోనియల్ కేసులపై విలేకరుల సమావేశంలో ఇదంతా వెల్లడించారు జడ్జీ రఘునాథ్‌.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?