AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.369 కోట్లతో అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొన్నారు.. ఎవరంటే

సొంతిళ్లు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని..అద్దె ఇంట్లో ఉండే వారు కోరుకుంటుంటారు. ఒక అపార్ట్ మెంట్ కొనుక్కోవాలంటే లక్షల్లో రేటుంటంది. ఇంకొంచెం ఖరీదైన అపార్ట్ మెంట్ అయితే కోట్లల్లో కూడా ఉంటుంది.

రూ.369 కోట్లతో అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొన్నారు.. ఎవరంటే
Luxary Building
Aravind B
|

Updated on: Mar 31, 2023 | 8:57 PM

Share

సొంతిళ్లు కట్టుకోవాలని లేదా కొనుక్కోవాలని..అద్దె ఇంట్లో ఉండే వారు కోరుకుంటుంటారు. ఒక అపార్ట్ మెంట్ కొనుక్కోవాలంటే లక్షల్లో రేటుంటంది. ఇంకొంచెం ఖరీదైన అపార్ట్ మెంట్ అయితే కోట్లల్లో కూడా ఉంటుంది. అయితే ముంబాయిలోని ఓ పారిశ్రామికవేత్త కుటుంబం అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ను కొన్నారు. ఆ అపార్టుమెంట్ విలువ దాదాపు రూ.369 కోట్లు. అరెబీయన్ సముద్రం ఒడ్డున మలబార్ హిల్ అనే ప్రాంతంలో హెల్త్‌కేర్‌ ఉత్పత్తుల సంస్థ ఫామీ కేర్‌ వ్యవస్థాపకుడు జేపీ తపారియా కుటుంబ సభ్యులు ఈ ఖరీదైన లగ్జరీ ట్రిప్లెక్స్ ఫ్లా్ట్ ను కొనుగోలు చేశారు.

సూపర్‌ లగ్జరీ నివాస టవర్‌గా పేరొందిన లోధా మలబార్‌ ప్యాలెసెస్‌లోని 26,27,28 అంతస్తుల్లో ఈ ట్రిప్లెక్స్‌ అపార్ట్ మెంట్ ఉంది. దీని వైశాల్యం 27,160 చదరపు అడుగులు. అంటే ఒక్కో చదరపు అడుగును రూ.1.36 లక్షలకు జేపీ తపారియా కుటుంబం కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ఇదే కావడం విశేషం. ఇంతకు ముందు లోధా గ్రూప్‌ నుంచి బజాజ్‌ ఆటో ఛైర్మన్‌ నీరజ్‌ బజాజ్‌ కూడా అత్యంత ఖరీదైన నివాసాన్ని రూ.252.5 కోట్లకు కొనుగోలు చేశారు. గత నెలలో వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ బీకే గోయెంకా రూ.230 కోట్లతో ముంబయిలోని వర్లీ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ పెంట్‌ హౌస్‌ను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..