Viral: పెళ్లికి పిలిచి మమ్మల్నే అవమానిస్తావా..? వరుడిపై రూ.50 లక్షల దావా వేసిన స్నేహితులు..

తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్‌ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి స్నేహితుడు.

Viral: పెళ్లికి పిలిచి మమ్మల్నే అవమానిస్తావా..? వరుడిపై రూ.50 లక్షల దావా వేసిన స్నేహితులు..
Haridwar Groom
Follow us

|

Updated on: Jun 28, 2022 | 12:13 PM

Haridwar groom sued by friends for Rs 50 lakh: వివాహ వేడుక అంటేనే బంధువులు, స్నేహితులతో ఎంతో సందడి సందడిగా సాగే కార్యక్రమం. అందుకే వివాహాన్ని చాలామంది ఎంతో స్పెషల్‌గా ప్లాన్‌ చేసుకుంటారు. ఇక్కడ ఓ వరుడు కూడా అలాగే ప్లాన్‌ చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఎంతో జోష్‌గా తన పెళ్లి బారాత్‌ జరుపుకోవాలనుకున్నాడు. అందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. తన ఫ్రెండ్స్‌ అందరికీ పెళ్లి బరాత్‌లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపించాడు వరుడి స్నేహితుడు. తీరా ఫ్రెండ్స్‌ వచ్చేసరికి వరుడు పెళ్లి మండపానికి వెళ్లిపోయాడు. దాంతో ఆగ్రహించిన మిత్రులు అతనిపై కేసుపెట్టారు.. ఈ విచిత్ర సంఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ ప్రాంతంలోని బహదూరాబాద్‌లో జరిగింది.

హరిద్వార్‌లోని బహదూరాబాద్ గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి జరిగింది. అయితే పెళ్లి రోజున సాయంత్రం ఐదు గంటలకు ఊరేగింపుగా వివాహానికి బయలుదేరుతున్నామని, స్నేహితులందరూ తప్పక బారాత్‌లో పాల్గొనాలని అతని స్నేహితుడిద్వారా అందరికీ ఇన్విటేషన్లు పంపాడు. అలాగే ఆ సమయానికి అందరం కలుసుకుందామని స్నేహితులకు చెప్పాడు. కాగా, పెళ్లి రోజున స్నేహితులందరు అనుకున్న సమయానికి వరుడు ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ సమయానికి ముందుగానే పెళ్లి కుమారుడు తన కుటుంబం, బంధువులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు వెళ్లిపోయాడు.

ఇది తెలిసిన స్నేహితులు పట్టరాని ఆగ్రహంతో వరుడికి ఫోన్‌ చేశారు. అయితే వారు రావడం ఆలస్యమైందని, అందుకే వెళ్లిపోయామని పెళ్లి కుమారుడు ఆరోపించాడు. తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని స్నేహితులతో అన్నాడు. దీంతో వరుడి తీరుపై చంద్రశేఖర్ అనే స్నేహితుడు మండిపడ్డాడు. వెంటనే న్యాయవాదిని సంప్రదించాడు. స్నేహితులను వదిలేసి పెళ్లి చేసుకోవడంతోపాటు తమ గౌరవాన్ని దెబ్బతీసినందుకు వరుడిపై 50 లక్షలకు పరువునష్టం దావా వేశాడు. పెళ్లికి ఆహ్వానించిన స్నేహితులు, అతిథులతోపాటు దానికి పురమాయించిన తనను మానసికంగా హింసించినట్లు అందులో ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
గంపతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళ.. అధికారులకు ముచ్చెమటలు..
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. అందులో ఏముందంటే ??