AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tridhya Tech: నువ్వు దేవుడివి సామీ.. అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే వీళ్లు కార్లను బహుమతిగా ఇచ్చారు.

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న భయాలు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని ఇంటికి సాగనంపాయి ఐటీ దిగ్గజ సంస్థలు. చిన్న చితకా స్టార్టప్‌లే కాదు..

Tridhya Tech: నువ్వు దేవుడివి సామీ.. అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే వీళ్లు కార్లను బహుమతిగా ఇచ్చారు.
It Company
Narender Vaitla
|

Updated on: Feb 03, 2023 | 3:20 PM

Share

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న భయాలు నెలకొన్నాయి. దిగ్గజ కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి ఊతమిచ్చేలా ఉంటున్నాయి. ఇప్పటికే వేలాది మందిని ఇంటికి సాగనంపాయి ఐటీ దిగ్గజ సంస్థలు. చిన్న చితకా స్టార్టప్‌లే కాదు మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ వంటి బహుల జాతి సంస్థలు సైతం వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. అయితే ఇలాంటి సంక్షోభ సమయంలో ఓ దేశీయ ఐటీ కంపెనీ చేసిన ఓ పనితో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన తిధ్య టెక్‌ అనే ఐటీ కంపెనీ తమ ఉద్యోగులను కార్లను బహుమతిగా ఇచ్చింది. తమ సంస్థ లాభాల బాట పట్టేందుకు కృషి చేస్తున్న 13 మంది ఉద్యోగులకు 13 కార్లను బహుమతిగా ఇచ్చింది. ఈ కంపెనీ స్థాపించి ఇటీవలే ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ విషయమై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ మరాంద్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచీ కంపెనీ ఉద్యోగులకు విశిష్ట సేవలందించారనీ, ఆ సేవలకు గాను వారికి కార్లు బహుమతిగా అందిస్తున్నామని తెలిపారు.

సంస్థ నిర్మాణం కోసం ఉద్యోగులు తమ స్థిరమైన ఉద్యోగాలను వదులుకొని మరీ వచ్చారని తెలిపిన రమేష్‌.. కార్లను బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే త్రిధ్య టెక్‌ కంపెనీ ఈకామర్స్, వెబ్ ,మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీకి ఆసియా, యూరప్ ఆస్ట్రేలియాలో క్లయింట్స్‌ ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..