Telangana: ఫ్రెండ్స్తో కలిసి నైట్ మందు పార్టీ.. కట్ చేస్తే.. తెల్లారేసరికి దిమ్మతిరిగే షాక్!
మన ఫ్రెండ్కు ఫ్రెండ్ అయితే.. మనకు కూడా ఫ్రెండే కదా బాసూ.. ఈ కొటేషన్ను ఫాలో అవుతూ..
మన ఫ్రెండ్కు ఫ్రెండ్ అయితే.. మనకు కూడా ఫ్రెండే కదా బాసూ.. ఈ కొటేషన్ను ఫాలో అవుతూ.. ఓ వ్యాపారి సరదాగా తన ఫ్రెండ్తో కలిసి మందు పార్టీ చేసుకుంటుంటే.. ఇంతలో కలిసిన తన ఓల్డ్ ఫ్రెండ్, ఫ్రెండ్కి ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తిని ఆహ్వానించాడు. ఈ నలుగురు అర్ధరాత్రి దాకా పబ్లో తెగ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత వ్యాపారి ఇంటికి వచ్చి.. మరో రౌండ్ కుమ్మేశారు. కట్ చేస్తే.. తెల్లారేసరికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. మూసారాంబాగ్ డివిజన్కు చెందిన వ్యాపారి సాయిప్రకాష్ రెడ్డి.. శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్ ఫిరోజ్తో కలిసి స్థానికంగా ఉండే పబ్కు వెళ్లాడు. అక్కడ సరదా మందు పార్టీ చేసుకున్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన సాయిప్రకాష్ రెడ్డి ఓల్డ్ ఫ్రెండ్ రాజేష్ కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రాజేష్ తనకు మిత్రుడంటూ ఓ వ్యక్తిని సాయిప్రకాష్కు పరిచయం చేశాడు. వీళ్ల నలుగురు అర్ధరాత్రి వరకు పబ్లో ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత మరో రౌండ్ మందు కొట్టేందుకు సలీమ్నగర్లోని సాయిప్రకాష్ ఇంటికి చేరుకున్నారు.
ఇంటికి చేరుకోగానే ఓ గదిలో ఫిరోజ్ పడుకోగా.. మిగతా ముగ్గురు ఫుల్గా మద్యం సేవించారు. ఇక సీన్ కట్ చేస్తే.. తెల్లారేసరికి సాయిప్రకాష్ రెడ్డి బెడ్రూమ్లో ఉన్న ఓ బ్యాగ్ నుంచి సుమారు రూ. 75 లక్షలు మాయమయ్యాయి. అంతేకాదు రాజేష్, అతడి స్నేహితుడు కనిపించలేదు. దీంతో సాయిప్రకాష్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసిన ఖాకీలు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..