AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.200 కోట్ల విలువైన ప్రైవేట్‌ జెట్‌కు ముఖేష్ అంబానీ పూజారి పూజలు.. ఓనర్ ఎవరంటే..

ఇక ఈ గల్ఫ్‌స్ట్రీమ్ G280 విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే..ఇందులో 10 మంది కూర్చునే సామర్థ్యం, 6,667 కిలోమీటర్ల పరిధి కలిగిన ఒక ఉన్నత-తరగతి ప్రైవేట్ జెట్. 200 కోట్ల రూపాయల విలువైన ఈ జెట్ విమానం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిపించిన ప్రఖ్యాత పండిట్ చంద్రశేఖర్ శర్మ గల్ఫ్‌స్ట్రీమ్ G280 ప్రైవేట్ జెట్ విమానానికి బెంగళూరు విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. దీంతో ఈ జెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది మరింత ఉత్కంఠ భరితంగా మారింది.

రూ.200 కోట్ల విలువైన ప్రైవేట్‌ జెట్‌కు ముఖేష్ అంబానీ పూజారి పూజలు.. ఓనర్ ఎవరంటే..
Private Jet
Jyothi Gadda
|

Updated on: May 22, 2025 | 6:40 PM

Share

కొత్త కార్లు లేదా వాహనాలను పూజించే సంప్రదాయం భారతదేశంలో సాధారణం. ఈ క్రమంలోనే బెంగళూరు విమానాశ్రయంలో విలాసవంతమైన గల్ఫ్‌స్ట్రీమ్ G280 ప్రైవేట్ జెట్ విమానానికి సాంప్రదాయకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఆ ప్రైవేట్‌ జెట్‌ విమానానికి యజమాని ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఈ విమానానికి పూజలు చేసింది కూడా మరో ప్రముఖ పూజారి కావడం ఇక్కడ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరిపించిన ప్రఖ్యాత పండిట్ చంద్రశేఖర్ శర్మ గల్ఫ్‌స్ట్రీమ్ G280 ప్రైవేట్ జెట్ విమానానికి బెంగళూరు విమానాశ్రయంలో పూజలు నిర్వహించారు. దీంతో ఈ జెట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది మరింత ఉత్కంఠ భరితంగా మారింది.

వైరల్‌ వీడియోలో గల్ఫ్‌స్ట్రీమ్ G280 ప్రైవేట్‌ జెట్‌ విమానానికి పండితుడు చంద్రశేఖర్‌ శర్మ మంత్రాలు జపిస్తూ, హారతి పట్టారు. విమానం ముందు భాగంలో స్వస్తిక చిహ్నాన్ని దిద్దారు. విమానం లోపల అతను గణేశుడు, లక్ష్మీ దేవి, సరస్వతి దేవి విగ్రహాలను పూజించాడు. సురక్షితమైన ప్రయాణం, శ్రేయస్సు కలగాలని ఆశీర్వాదించాడు. ఇక ఈ గల్ఫ్‌స్ట్రీమ్ G280 విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే..ఇందులో 10 మంది కూర్చునే సామర్థ్యం, 6,667 కిలోమీటర్ల పరిధి కలిగిన ఒక ఉన్నత-తరగతి ప్రైవేట్ జెట్. దాని రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజన్లు, ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల థ్రస్ట్ కలిగి, 900 కి.మీ/గం వేగంతో ఎగరడానికి వీలుగా ఉంటుంది. 200 కోట్ల రూపాయల విలువైన ఈ జెట్ విమానం అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ఎంపైర్ ఏవియేషన్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. అయితే, ఈ విమానాన్ని కొనుగోలు చేసిన ఆ అజ్ఞాత వ్యక్తి మరెవరో కాదు, ఎంబసీ గ్రూప్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జితేంద్ర (జీతు) విర్వానీ.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

జీతు విర్వాణి ఎవరు?

జీతు విర్వాణి భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రముఖ పేరున్న వ్యక్తి. అతను 1993లో తన తండ్రి నుండి ఎంబసీ గ్రూప్‌ను స్వాధీనం చేసుకుని దానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. 2019లో అతను బ్లాక్‌స్టోన్‌తో భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REIT)ను ప్రారంభించాడు. రియల్ ఎస్టేట్ తో పాటు, విర్వాణి ఇతర రంగాలలోకి కూడా అడుగుపెట్టింది. వీవర్క్ ఇండియాలో ఎంబసీ గ్రూప్ 73శాతం వాటాను కలిగి ఉంది. ఇక్కడ జీతు విర్వానీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అతని కుమారుడు కరణ్ విర్వానీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా ఉన్నారు. ఈ గ్రూప్ ఆలివ్ బై ఎంబసీ కింద హాస్పిటాలిటీలోకి ప్రవేశించింది. రాబోయే దశాబ్దంలో $533 మిలియన్ల పెట్టుబడితో భారతదేశంలో 150 స్పార్క్ బై హిల్టన్ హోటళ్లను నిర్మించాలని యోచిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us