AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 ఏళ్ల మిస్టరీ వీడింది.. అక్కడ దొరికిన 3,000 బంగారు నాణేలు 4,500 ఏళ్ల నాటివి!

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లా మాండి గ్రామంలో దొరికిన ప్రాచీన బంగారు నాణేలు, ఆభరణాల మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దాదాపు 27 ఏళ్ల క్రితం 1999లో పొలం దున్నుతుండగా బయటపడిన ఈ బంగారు నిధిపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విస్తృత పరిశోధనలు జరిపింది. ఈ క్రమంలో ఈ బంగారు ఆభరణాలు, నాణేలు సుమారు 4,500 సంవత్సరాల నాటివని స్పష్టమైంది. ఇవి సింధు లోయ నాగరికతకు..

27 ఏళ్ల మిస్టరీ వీడింది.. అక్కడ దొరికిన 3,000 బంగారు నాణేలు 4,500 ఏళ్ల నాటివి!
Mandi Gold Treasure
Jyothi Gadda
|

Updated on: Sep 11, 2026 | 4:43 PM

Share

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫ్ఫర్‌నగర్ జిల్లాలోని మాండి గ్రామంలో దశాబ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన అరుదైన బంగారు నాణేలు, ఆభరణాల మిస్టరీని పురావస్తు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. 1999 జూన్‌లో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అనుకోకుండా ఒక మట్టికుండలో పెద్ద మొత్తంలో ప్రాచీన బంగారు నాణేలు, పూసలు, ఆభరణాలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఈ నిధి గురించి రకరకాల ప్రచారాలు సాగాయి. అయితే, సుదీర్ఘ పరిశోధనల తర్వాత ఇవి ఏకంగా 4,500 ఏళ్ల క్రితం నాటివని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది.

హరప్పా నాగరికతతో ముడిపడిన మూలాలు:

పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ బంగారు నిధి క్రీస్తు పూర్వం 2500 నాటిదని, అంటే సింధు లోయ నాగరికత ఉత్తర పూర్వ కాలానికి చెందినదని స్పష్టమైంది. మాండి గ్రామం హరప్పా సంస్కృతి వ్యాపించిన సరిహద్దుల్లో ఒకటని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.

ఈ నిధిలోని ప్రత్యేకతలు:

లభించిన బంగారు పూసలు, బిళ్లలు, నాణేల ఆకారంలో ఉన్న ఆభరణాలు నాడు ప్రజల అద్భుతమైన లోహ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భారతదేశంలో సింధు నాగరికత స్థావరాలలో లభించిన అతిపెద్ద బంగారు సేకరణలలో మాండి నిధి ఒకటిగా నిలిచింది. ఇక్కడ దాదాపు 10 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు లభ్యమైనట్లు అప్పట్లో ఆధారాలు లభించాయి. మాండి ప్రాంతం నాడు ప్రధానమైన వ్యాపార కేంద్రంగా, స్వర్ణకారుల తయారీ స్థావరంగా పనిచేసి ఉండవచ్చని పురావస్తు అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

పరిశోధనల ప్రాముఖ్యత:

సాధారణంగా హరప్పా నాగరికత అనగానే రాగి, కాంస్య వస్తువులే ఎక్కువ కనిపిస్తాయనే భావన ఉండేది. కానీ మాండి గ్రామంలో లభించిన ఈ 4,500 ఏళ్ల నాటి బంగారు ఆభరణాలు నాటి ప్రజల సంపద, సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నతంగా ఉండేదో తెలియజేస్తున్నాయి. 27 ఏళ్ల సుదీర్ఘ శోధన తర్వాత తేలిన ఈ నిజం భారతీయ ప్రాచీన చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us